Home > జాతీయం > ఫేస్బుక్ లవ్ స్టోరీ.. పిల్లల్ని వదిలి ప్రియుడి కోసం పాక్ వెళ్లిన మహిళ

ఫేస్బుక్ లవ్ స్టోరీ.. పిల్లల్ని వదిలి ప్రియుడి కోసం పాక్ వెళ్లిన మహిళ

ఫేస్బుక్ లవ్ స్టోరీ.. పిల్లల్ని వదిలి ప్రియుడి కోసం పాక్ వెళ్లిన మహిళ
X

ఆమెకు పెళ్లైంది. ఇద్దరు పిల్లలున్నారు. భర్తకు చేదోడువాదోడుగా ఉండేందుకు ఉద్యోగం కూడా చేస్తోంది. అయితే ఫేస్ బుక్ లో ఓ యువకుడితో పరిచయం ఆమె జీవితాన్ని మార్చేసింది. ప్రేమ కోసం దేశ సరిహద్దులు దాటేలా చేసింది. ప్రియున్ని కలుసుకునేందుకు పాకిస్థాన్ వెళ్లిన భారతీయురాలు అంజు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.

రాజస్థాన్ అల్వార్ జిల్లాకు చెందిన అంజు భర్త అరవింద్, ఇద్దరు పిల్లలతో కలిసి భివాడీలో నివసిస్తోంది. వారికి 15ఏండ్ల కూతురు, ఆరేండ్ల కొడుకు ఉన్నారు. భర్తకు సాయంగా తాను కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తోంది. జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో అంజుకు ఫేస్ బుక్ లో పాకిస్థాన్ కు చెందిన నస్రుల్లా అనే 29 ఏండ్ల యువకుడితో పరిచయమైంది. అది తొలుత స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది. వారిద్దరు ఛాటింగ్, ఫోన్ కాల్స్ మాట్లాడుకునే వారు.

గతవారం భర్తకు జైపూర్ వెళ్తున్నానని చెప్పిన అంజు పాకిస్థాన్ చేరుకుంది. వాయువ్య పాక్ లోని ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రావిన్సులోని అప్పర్ దిర్ జిల్లాకు వెళ్లి ప్రియుడు నస్రుల్లాను కలుసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే వీసా, ఇతర డాక్యుమెంట్లు సక్రమంగా ఉండటంతో అంజును వదలిపెట్టారు.

అంజుకు సంబంధించిన వార్త టీవీలో ప్రసారం కావడంతో భర్త అరవింద్కు ఆమె పాకిస్థాన్ వెళ్లిన విషయం తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం సైతం తనతో వాట్సప్ కాల్ మాట్లాడిందని రెండు మూడు రోజుల్లో వస్తానని చెప్పిందని వాపోయాడు. పాకిస్థాన్ యువకుడితో అంజు స్నేహం గురించి తనకు ముందే తెలుసని, విదేశాల్లో ఉద్యోగం పేరుతో 2020లో పాస్పోర్ట్ తీసుకుందని చెప్పాడు. పిల్లల కోసమైనా ఆమె భారత్ కు తిరిగి వస్తుందని అరవింద్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

Updated : 24 July 2023 4:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top