Home > జాతీయం > Jayalalithaa : జయలలిత నగలు వేలం..ఎన్ని కిలోలో తెలుసా!

Jayalalithaa : జయలలిత నగలు వేలం..ఎన్ని కిలోలో తెలుసా!

Jayalalithaa : జయలలిత నగలు వేలం..ఎన్ని కిలోలో తెలుసా!
X

దివంగత సీఎం జయలలితకు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయనున్నారు. అక్రమాస్తుల కేసులో 2014లో బెంగళూరు ప్రత్యేక కోర్టు జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్లు జరిమానా విధించింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ నలుగురు కర్ణాటక హైకోర్టులో అప్పీల్‌ చేయగా...విచారించిన హైకోర్టు నలుగురిని విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌ విచారణ సమయంలో 2016 డిసెంబరు 5న జయలలిత చనిపోయారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పుని సమర్థించింది. ఇప్పటికి జయలలిత చనిపోయి ఆరేళ్లు అయినా..ఆమె చెల్లించాల్సిన జరిమానా కట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె ఆస్తులను వేలం వేసి జరిమానా చెల్లించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. ఆమె ఇంట్లో అధికారులు స్వాధీనం చేసుకున్న 28 కిలోల బంగారు నగలు, 800 కిలోల వెండి, వజ్రాల నగలను కోర్టులో అప్పగించారు. ఈ నగలను వేలం వేసి వచ్చిన డబ్బుతో జరిమానా కట్టాలని నిర్ణయించారు.

ఈ మేరకు జయలలిత నగలను వచ్చే నెల 6, 7 తేదీల్లో తమిళనాడు తీసుకొచ్చి హోంశాఖ కార్యదర్శికి అప్పగించనున్నారు. వాటి ప్రస్తుత విలువ ద్వారా వేలం వేయనున్నారు. ఈ నగలే రూ.40 కోట్లు వరకు ధర పలకనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన జరిమానా రూ.60 కోట్లకు స్థిరాస్తులను వేలం వేసేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. ఇవికాకుండా కేసు ఖర్చుగా రూ.5 కోట్లు కర్ణాటక ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. దీంతో దీనిని కూడా జయలలిత ఆస్తులను వేలం వేసి చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.




Updated : 26 Feb 2024 5:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top