Home > జాతీయం > మణిపూర్లో రాహుల్ యాత్రకు అనుమతి నిరాకరణ

మణిపూర్లో రాహుల్ యాత్రకు అనుమతి నిరాకరణ

మణిపూర్లో రాహుల్ యాత్రకు అనుమతి నిరాకరణ
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు మణిపూర్ ప్రభుత్వం షాకిచ్చింది. మణిపూర్లో యాత్రకు పర్మిషన్ ఇవ్వలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని అనుమతిని నిరాకరిస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఇవాళ సీఎం బీరెన్ సింగ్తో కాంగ్రెస్ బృందం భేటీ అయ్యింది. రాహుల్ యాత్రకు పర్మిషన్ ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేసింది. తాజాగా మణిపూర్లో మళ్లీ హింసాత్మక ఘటనలు చెలరేగడంతో అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది.

భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపడుతున్నారు. ఈ యాత్ర 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మయన్మార్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు - ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రత బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో యాత్ర ఎక్కడినుంచి ప్రారంభమవుందనేది సస్పెన్స్గా మారింది. జనవరి 14న ప్రారంభమయ్యే భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్చి 30న ముగియనుంది. 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా 66 రోజులపాటు సుమారు 6,713 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. దాదాపు 100 లోక్‌సభ స్థానాలను కవర్ చేసేలా యాత్ర జరగనుంది.

రాహుల్ యాత్ర అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్రల మీదుగా సాగుతుంది. భారత్‌ జోడో యాత్ర పాదయాత్ర కాగా.. న్యాయ్‌ యాత్ర మాత్రం బస్సుల్లో కొనసాగుతుంది. అయితే మధ్యమధ్యలో మాత్రం పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. గతంలో రాహుల్‌ గాంధీ.. 2022లో రాహుల్ గాంధీ కన్యా కుమారి నుంచి కశ్మీర్‌ వరకు 136 రోజులపాటు 12 రాష్ట్రాల్లో దాదాపు 4,500 కిలోమీటర్ల మేర జోడో యాత్ర చేపట్టారు.

Updated : 10 Jan 2024 8:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top