Home > జాతీయం > జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్​.. నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్​.. నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్​.. నలుగురు ఉగ్రవాదులు హతం
X

పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా నలుగురు ఉగ్రవాదులు భారత్లో చొరబడేందుకు యత్నించి.. భద్రతాబలగాల కాల్పుల్లో హతమయ్యారు. జమ్మూ కశ్మీర్ కుప్వారాలోని మచల్​ సెక్టార్లో పోలీసులు, ఆర్మీ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ ఆపరేషన్లో నియంత్రణ రేఖ గుండా పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది గుర్తించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. కాగా, జూన్ 16న కుప్వారా జిల్లాలోని జుమాగుండ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులు హతమయ్యారు.

Updated : 23 Jun 2023 6:46 AM GMT
Tags:    
author-thhumb

Krishna

సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.


Next Story
Share it
Top