Home > జాతీయం > Monkey Fever : కర్ణాటకను వణికిస్తున్న మంకీ ఫీవర్...ఇద్దరు మృతి

Monkey Fever : కర్ణాటకను వణికిస్తున్న మంకీ ఫీవర్...ఇద్దరు మృతి

Monkey Fever : కర్ణాటకను వణికిస్తున్న మంకీ ఫీవర్...ఇద్దరు మృతి
X

కర్ణాటకలో మంకీ ఫీవర్‌ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మంకీ ఫీవర్ కేసులు రోజు రోజుకు పెరగుతున్నాయి. దీంతో, అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు తగిన రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఈ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మంకీ ఫీవర్‌ కర్ణాటకను వణికిస్తోంది. రాష్ట్రంలో ఇద్దరు చనిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకాకు చెందిన యువతి (18), ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన ఒక వృద్ధుడు (79) చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సమాచారం. ఇక, మంకీ ఫీవర్ కు సంబంధించి ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో మూడు కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ రణ్‌దీప్‌ తెలిపారు. అంతేగాక శివమొగ్గలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను డాక్టర్లను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తతెలుసుకున్నారు. మరోవైపు.. ఇప్పటివరకు 2,288 నమూనాలను సేకరించి పరీక్షించగా అందులో 49 మందికి మంకీ ఫీవర్‌ ఉన్నట్లు గుర్తించామన్నారు డాక్టర్లు.

వ్యాధి లక్షణాలు

కోతులను కరిచిన కీటకాలు మళ్లీ మనిషిని కుడితే ఈ వ్యాధి సోకుతుందని డాక్టర్లు స్పష్టం చేశారు. వ్యాధి సోకిన వారికి తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్‌ వేయించేందుకు ఐసీఎంఆర్‌ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు. వ్యాధి ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకోవాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు పాటించాలన్నారు. జ్వరం లాంటివి వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.

Updated : 5 Feb 2024 4:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top