Home > జాతీయం > E-Scooters :సీఎం స్పెషల్ గిఫ్ట్.. ప్లస్ టూ టాపర్లకు ఈ స్కూటర్లు

E-Scooters :సీఎం స్పెషల్ గిఫ్ట్.. ప్లస్ టూ టాపర్లకు ఈ స్కూటర్లు

E-Scooters :సీఎం స్పెషల్ గిఫ్ట్.. ప్లస్ టూ టాపర్లకు ఈ స్కూటర్లు
X





ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 12వ తరగతి పరీక్షల్లో టాపర్లుగా నిలిచిని విద్యార్థులకు మధ్యప్రదేశ్ సీఎం గిఫ్ట్స్ ఇవ్వనున్నారు. ఆ విద్యార్థులందరికీ ఈ స్కూటర్లు(E-Scooters) ఇవ్వాలని ధ్యప్రదేశ్ మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.ఈ ఏడాది చివరి నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల(ఎస్సీ, ఎస్టీ) విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కోసం కుటుంబ ఆదాయ పరిమితిని రూ. 6 లక్షల నుండి రూ. 8 లక్షలకు పెంచే ప్రతిపాదనను శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గం ఆమోదించింది





ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ పాఠశాలల్లో విద్యనభ్యసించి ప్రథమ స్థానం (వరుసగా స్త్రీ, పురుషుల విభాగాల్లో) సాధించిన ప్రతి విద్యార్థికి ఇ-స్కూటర్‌ అందించాలని మంత్రివర్గం నిర్ణయించిందని హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా తెలిపారు.ఈ పథకం ద్వారా దాదాపు 9 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. దీని అమలు కోసం 2023-24 బడ్జెట్‌లో రూ.135 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ-స్కూటర్ అందుబాటులో లేని ప్రాంతాల్లో పెట్రోల్‌తో నడిచే స్కూటర్‌ను అందజేస్తామని మిశ్రా తెలిపారు.ఒక పాఠశాలలో ఒకటి కంటే ఎక్కువ మంది విద్యార్థులు అగ్రస్థానంలో ఉంటే, వారందరికీ ఈ-స్కూటర్లను అందజేస్తామన్నారు.రాష్ట్ర సహకార విధానం 2023కి కూడా బుధవారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


Updated : 15 Jun 2023 1:37 AM GMT
Tags:    
Next Story
Share it
Top