Home > జాతీయం > National Flag :స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నాళ్లకు ఆ ఊళ్లో జాతీయ జెండా రెపరెపలు

National Flag :స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నాళ్లకు ఆ ఊళ్లో జాతీయ జెండా రెపరెపలు

National Flag :స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నాళ్లకు ఆ ఊళ్లో జాతీయ జెండా రెపరెపలు
X

స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయినా ఇంకా దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుటికీ మావోయిస్టులు చెరలో ఉన్నాయి. అలాంటి ఓ ప్రాంతంలో స్వాతంత్ర్యం సిద్ధించాక తొలిసారి మువ్వన్నెల పతాకం ఎగిరింది. దీంతో ఆ గ్రామస్థులు ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని(Chattisgarh) సుక్మాలోని పువర్తి గ్రామంలో ఒకప్పుడు ప్రభుత్వానికి సమాంతరంగా మావోయిస్టులు(Maoists) ప్రభుత్వాన్ని నడిపారు. ఈ గ్రామం.. మావోయిస్ట్‌ అగ్రనేత హిడ్మా స్వగ్రామం కావడం గమనార్హం. దీంతో ఆ ప్రాంతంలోకి వెళ్లాలంటేనే పోలీసులు వెనక్కి తగ్గేవారు. ఇక హిడ్మా కోసం పోలీసులు ఎన్నో ఆపరేషన్లు చేపట్టినా.. వాటి నుంచి తప్పించుకుని పోలీసులకు సవాల్ విసిరేవాడు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి భద్రతా బలగాలు పోలీసు శిబిరాన్ని ఏర్పాటు చేయగా.. భద్రతా బలగాలకు వ్యతిరేకంగా.. మావోయిస్టులు దాడులకు ప్లాన్ చేశారు. అయితే భద్రతా దళాల తనిఖీలో మావోయిస్టులు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న తరువాత పోలీసులు.. గ్రామంలో జెండా ఎగరవేయడానికి ఏర్పాటు చేశారు. అలా.. సోమవారం జాతీయ జెండా ఎగురవేసి అక్కడి ప్రజలకు స్వేచ్ఛా వాయువు అందించారు. దీంతో స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత తొలిసారి అక్కడ జాతీయ జెండా రెపరెపలాడింది.

తమ అవసరాల కోసం మావోయిస్టులు కూరగాయలు పండించే భూమిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆ ప్రాంతం మావోయిస్టుల శిక్షణా శిబిరంగా ఉండేది. అక్కడ వారు సమావేశాలు నిర్వహించి సమీపంలో నివసిస్తున్న యువకులను నియమించుకునేవారు. వారికి దాడులు ఎలా చేయాలో నేర్పేవారు. గ్రామంలో భద్రతా శిబిరాన్ని తెరవడం మావోయిస్టుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. ఒకప్పుడు పోలీసులు అడుగు పెట్టడానికి భయపడే ప్రాంతంలో, గత కొన్ని నెలల్లో అలాంటి ఏడు శిబిరాలు తెరిచారు. మావోయిస్టుల కదలిక సమాచారం అందగానే అక్కడి నుంచి భద్రతా బృందాన్ని హుటాహుటిన పంపవచ్చు. మావోయిస్టు కార్యకలాపాలకు గ్రామస్థులు దూరంగా ఉండాలని.. వారికి ప్రభుత్వ పథకాలన్నీ అందేలా చూస్తామని అధికారులు తెలిపారు. ఇటీవల టేకల్ గూడ పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేయడంతో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. దానికి ప్రతిగా పువర్తి గ్రామంలో పోలీసులు నిఘా పెంచినట్లు తెలుస్తోంది.

Updated : 20 Feb 2024 2:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top