Home > జాతీయం > ఇష్టమొచ్చినట్లు సోషల్‌ మీడియాలో జడ్జీలను దూషిస్తే శిక్ష తప్పదు.. సుప్రీంకోర్టు

ఇష్టమొచ్చినట్లు సోషల్‌ మీడియాలో జడ్జీలను దూషిస్తే శిక్ష తప్పదు.. సుప్రీంకోర్టు

ఇష్టమొచ్చినట్లు సోషల్‌ మీడియాలో జడ్జీలను దూషిస్తే శిక్ష తప్పదు.. సుప్రీంకోర్టు
X


న్యాయమూర్తులపై సోషల్ మీడియా వేదికగా ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేసినా.. అడ్డగోలు వ్యాఖ్యలు చేసినా ఇకపై శిక్షలు తప్పవు. అలా దూషించిన వారిని శిక్షించడం సబబేనని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమకు అనుకూలంగా తీర్పు రాకపోయినా.. లేకపోతే తమకు ఇష్టంలేని తీర్పు చెప్పారనో జడ్జిలను సోషల్‌ మీడియాల ద్వారా దూషిస్తే .. అలా చేసిన వారు శిక్షకు అర్హులవుతారని చెప్పింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో... దేవాలయానికి సంబంధించిన ఓ కేసులో తీర్పు చెప్పిన అదనపు జిల్లా జడ్జిపై కృష్ణ కుమార్‌ రఘువంశి అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలు చేసినందుకు అతనిపై రాష్ట్ర హైకోర్టు సుమోటోగా.. క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. దీనిపై సదరు వ్యక్తి.. సుప్రీంను ఆశ్రయించగా తీర్పులో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. జిల్లా జడ్జిపై అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తికి పది రోజుల జైలు శిక్ష విధిస్తూ మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్‌ బేల ఎం త్రివేది, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాల ధర్మాసనం సమర్థించింది. అనుకూలంగా తీర్పు రానంత మాత్రాన జడ్జిని దూషించలేరని తెలిపింది.

సోషల్‌ మీడియాలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత అంటే కార్యనిర్వాహక వ్యవస్థ నుంచే కాకుండా బయట వ్యక్తుల నుంచి కూడా స్వతంత్రంగా ఉండాలన్న అర్థమని పేర్కొంది. న్యాయాధికారిపై ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుందని తెలిపింది. శిక్ష మరీ కఠినంగా ఉందని, కనికరం చూపాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరగా, ఇలాంటి వాటిని క్షమించేది లేదని స్పష్టం చేసింది

Updated : 31 May 2023 6:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top