Home > జాతీయం > 2 వేల నోట్లను పోస్టులో పంపితే.. మీ అకౌంట్లో డబ్బులేస్తం: ఆర్బీఐ

2 వేల నోట్లను పోస్టులో పంపితే.. మీ అకౌంట్లో డబ్బులేస్తం: ఆర్బీఐ

2 వేల నోట్లను పోస్టులో పంపితే.. మీ అకౌంట్లో డబ్బులేస్తం: ఆర్బీఐ
X

ఆర్‌బీఐ (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) రూ. 2వేల నోట్ల మార్పిడిని సులభతరం చేసేందుకు.. కొత్త సిస్టమ్ ను ప్రవేశపెట్టనుంది. ప్రజలు తమ వద్ద ఉన్న 2 వేల నోట్లను పోస్టు ద్వారా తమకు పంపిస్తే, వారి బ్యాంకు అకౌంట్లలో ఆ మొత్తాన్ని జమ చేస్తామని ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ ప్రకటించారు. ప్రాంతీయ కార్యాలయాలకు దూరంగా ఉండే ప్రజలు తమ దగ్గరున్న 2వేల నోట్లను మార్చుకోవడాన్ని సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. స్పెసిఫైడ్​ రీజినల్​ ఆఫీసులకు ఇన్సూర్డ్ ​ పోస్ట్​ ద్వారా 2 రెండు వేల నోట్లను ఆర్బీఐకి పంపాల్సి ఉంటుంది. ఈ అవకాశంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఆర్బీఐ అధికారులు చెప్పారు.

ట్రిపుల్​ లాక్​ రిసెప్టకిల్​ (టీఎల్​ఆర్​) ఫార్మ్​ ఆప్షన్​ కూడా కల్పిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ రెండు పద్ధతులూ చాలా సురక్షితమైనవని, భయపడాల్సిన అవసరం లేదని ఆర్బీఐ చెప్పంది. ఇప్పటివరకు ఒక్క ఢిల్లీ ఆఫీసులోనే 700 టీఎల్​ఆర్​ ఫార్మ్స్​ తమకు వచ్చినట్లు చెప్పింది. అక్టోబర్​ 8 నుంచి 19 రీజినల్​ ఆఫీసుల్లో 2 వేల నోట్లను మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ క్రమంలో ప్రజల చేతిలో ఇంకా రూ. 10 వేల కోట్ల విలువైన 2 వేల నోట్లు మాత్రమే మిగిలాయని ఇటీవలే ఆర్బీఐ గవర్నర్​ చెప్పిన విషయం తెలిసిందే.




Updated : 3 Nov 2023 2:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top