Home > జాతీయం > Phone Pe : ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో టాలీవుడ్ స్టార్ హీరో వాయిస్

Phone Pe : ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో టాలీవుడ్ స్టార్ హీరో వాయిస్

Phone Pe : ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో టాలీవుడ్ స్టార్ హీరో వాయిస్
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల కంటే కమర్షియల్ యాడ్స్‌తో ఎక్కువ ఆదాయం పొందుతుంటారు. తన సంపాదనలో చాలా వరకూ పేదల కోసం, పిల్లల చికిత్స కోసం ఖర్చు చేస్తుంటాడు. ఇప్పటికే మహేష్ బాబు పాతికకు పైగా బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా పనిచేస్తూ వస్తున్నారు. తాజాగా మరో సంస్థకు అంబాసిడర్‌గా మారి తన వాయిస్‌ను అందిస్తున్నారు.

మనీ ట్రాన్స్‌ఫర్ యాప్ అయిన ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో ఇకపై మహేష్ బాబు గొంతు వినిపించనుంది. ఫోన్ పే నుంచి డబ్బులు సెండ్ చేసినప్పుడు మనీ రిసీవ్డ్ అంటూ కంప్యూటర్ జెనెరేటెడ్ వాయిస్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ వాయిస్‌కు బదులుగా మహేష్ బాబు వాయిస్ వినిపించనుంది. ఇందుకోసం మహేష్ బాబు వాయిస్‌‌‌లో కొన్ని శాంపిల్స్ తీసుకుని వాటిని ఏఐ టూల్‌ వాయిస్‌తో జెనెరేట్ చేశారు.

ఇప్పటికే అమితాబ్ బచ్చన్ వాయిస్‌ ఫోన్‌పే లావాదేవీలతో వినిపిస్తూ మార్కెట్లోకి విడుదలైంది. అందుకోసం అమితాబ్ కొంత డబ్బును ఛార్జి చేస్తారట. మరిప్పుడు మహేష్ బాబు వాయిస్‌కు కూడా అలాగే ఛార్జీలు చెల్లెంచే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో SSMB29 మూవీ చేయనున్నాడు. ఈ మూవీ మే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Updated : 21 Feb 2024 5:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top