Home > జాతీయం > జీ 20 నేతలకు ఆంధ్రా అరకు కాఫీ..మోదీ గిఫ్ట్

జీ 20 నేతలకు ఆంధ్రా అరకు కాఫీ..మోదీ గిఫ్ట్

జీ 20 నేతలకు ఆంధ్రా అరకు కాఫీ..మోదీ గిఫ్ట్
X

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆంధ్రా అరకు కాఫీకి మరో అరుదైన ప్రాధాన్యత లభించింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్‎కు వచ్చిన ప్రపంచ నేతలకు ఈ కాఫీ రుచులను దేశ ప్రధాని మొదీ బహుమతిగా అందించారు. ఆంధ్రాలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గిరిజన రైతులు సేంద్రియ పద్ధతుల్లో పండించిన కాఫీ రుచి ప్రపంచదేశాలకు తెలియాలనే ఉద్దేశంతో మోదీ ఈ చొరవ తీసుకున్నారు. G20 నేతలకు ప్రధాని మోడీ అరకు కాఫీ బహుమతిగా ఇచ్చినందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేసారు ఆనంద్ మహీంద్రా. అరకు ఒరిజనల్స్ బోర్డ్ చైర్మన్ గా ఉన్న తనకు ఎంతో గర్వంగా ఉందంటూ ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

" జీ20 నేతలకు అరకు కాఫీ బహుమతి ఎంపిక కావడం నాకు చాలా బాగా నచ్చింది. నిజానికి ఎంతో గర్వంగా ఉంది. అరకు కాఫీ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. గ్రోన్ ఇన్ ఇండియాకి సరైన ఉదాహరణ"అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసారు. ఆంధ్రప్రదేశ్‌లోని అతి సుందరమైన అరకు లోయలో ఈ కాఫీనీ సేంద్రియ విధానంలో పండిస్తారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా పూర్తి ప్రకృతి సిద్ధంగా దీనిని సాగు చేస్తారు. అందుకే ప్రపంచ దేశాల లీడర్లకు మోడీ భారత్ యొక్క వైవిధ్యమైన రుచులను అందించారు. అరకు కాఫీని ప్రపంచ లీడర్లకు అందించడం వల్ల సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై దేశానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచినట్లైంది.

As the Chairman of the Board of Araku Originals, I can’t argue with this choice of gift! It just makes me very, very proud. Araku Coffee is the perfect example of ‘The best in the World, Grown in India’… https://t.co/VxIaQT6nZL

Updated : 13 Sep 2023 9:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top