జీ 20 సమ్మిట్ సక్సెస్.. ఆ 450 మందికి మోడీ స్పెషల్ డిన్నర్..
Kiran | 13 Sep 2023 10:44 AM GMT
X
X
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీ 20 సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ సదస్సు విజయవంతం కావడంతో కేంద్రం హర్షం వ్యక్తం చేసింది. సమ్మిట్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కీలకంగా వ్యవహరించిన ఢిల్లీ పోలీసులను ప్రధాని మోడీ ప్రశంసించారు. ఈ క్రమంలోనే వారి కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆ విందులో ప్రధాని మోడీ వారితో కలిసి భోజనం చేయనున్నారు.
జీ 20 సదస్సు సందర్భంగా కానిస్టేబుళ్ల నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు అద్బుతంగా పనిచేసిన సిబ్బంది లిస్టు రూపొందించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాను కోరినట్లు తెలుస్తోంది. ఈ విందులో మొత్తం 450 మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటారని సమాచారం. జీ 20 సమ్మిట్ జరిగిన భారత్ మండపంలో ఈ వారంలోనే ఈ విందు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Updated : 13 Sep 2023 10:44 AM GMT
Tags: National news g20 summit delhi pm modi g20 security delhi police special dinner constable inspector delhi police commissioner sanjay arora 450 cops bharat mandap next week PM Modi's Dinner Plan With 450 Delhi Cops Modi's Dinner Plan With Cops Delhi Cops PM Modi To Have Dinner With Delhi Police Personnel PM Modi to host dinner for police officers Successful G20 Summit 2023
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire