Home > జాతీయం > డెలివరీ బాయ్స్, శానిటైజేషన్ సిబ్బందితో రాహుల్ భేటీ

డెలివరీ బాయ్స్, శానిటైజేషన్ సిబ్బందితో రాహుల్ భేటీ

డెలివరీ బాయ్స్, శానిటైజేషన్ సిబ్బందితో రాహుల్ భేటీ
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారానికి చివరి రోజైన మంగళవారం డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లు, జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, గిగ్ వర్కర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ కు వారి తమ సమస్యలను చెప్పుకున్నారు. ఓ డెలివరీ బాయ్ తో మాట్లాడుతూ.. రోజువారీ వారి దినచర్య ఎలా ఉంటుంది? ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో.. అడిగి శ్రద్ధగా విన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డెలివరీ బాయ్స్ రాహుల్ గాంధీని కోరారు. యాక్సిడెంట్ అయినా, ఐటమ్స్ డామేజ్ అయినా డెలివరీ ఏజెన్సీలు పట్టించుకోవని తెలిపారు. కస్టమర్, కంపెనీల మధ్య నలిగిపోతున్నామని తెలిపారు. కస్టమర్స్ ఎలా ఇబ్బందులు పెడతారో వివరించారు. కంపెనీ పెట్రోల్ ఖర్చులు ఇవ్వదని, కస్టమర్ చివరి నిమిషంలో క్యాన్సల్ చేస్తే ఆ భారం తమ మీద పడుతుందని తెలిపారు. ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని కోరారు.

పారిశుద్ధ్య కార్మికులు తమ బాధను తెలియజేస్తూ.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు కాంట్రాక్టు ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపించారు. తమకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదన్నారు. కాంట్రాక్టర్లు 11 గంటలు పనిచేయిస్తున్నారని కార్మికులు తెలిపారు. సదుపాయాలు అడిగితే ఉద్యోగం మానేయమంటున్నారని ఆవేదన చెందారు. తమకు పెన్షన్లు లేవని.. పనికి వెళ్లని రోజు జీతం కట్ చేస్తారని తెలిపారు. ఐదు గంటల వరకు థంబ్ వేయాల్సిందేనని చెప్పారు. చీపురుతో నిత్యం ఊడవడం వల్ల ఛాతిలో తీవ్ర నొప్పి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ గెలవగానే.. కార్మికులతో సీఎం సమావేశం అవుతారన్నారు.

క్యాబ్, ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ.. పోలీసులు చలాన్లతో వేధిస్తున్నారన్నారు. తరచూ ప్రమాదాల బారినపడుతున్నామని తమ బాధను రాహుల్‌కు చెప్పారు. తమకు ప్రమాద బీమా కల్పించాలని డెలివరీ బాయ్స్ రాహుల్ గాంధీని కోరారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతానని రాహుల్ గాంధీ వారికి హామీ ఇచ్చారు.

Updated : 28 Nov 2023 6:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top