Home > జాతీయం > ర్యాపిడ్ఎక్స్ రైళ్ల పేరు మార్పు.. దేశం పేరు కూడా మార్చేయండని కాంగ్రెస్ సైటర్లు

ర్యాపిడ్ఎక్స్ రైళ్ల పేరు మార్పు.. దేశం పేరు కూడా మార్చేయండని కాంగ్రెస్ సైటర్లు

ర్యాపిడ్ఎక్స్ రైళ్ల పేరు మార్పు.. దేశం పేరు కూడా మార్చేయండని కాంగ్రెస్ సైటర్లు
X

దేశంలో కొత్తగా ప్రవేశపెడుతున్న ర్యాపిడ్ ఎక్స్ సెమీ హైస్పీడ్ రైళ్ల పేరు మార్చారు. ఈ ట్రైన్ల ప్రారంభించడానికి ఒక్కరోజు ముందు రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ సిస్టం రైళ్లకు నమో భారత్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు. ఢిల్లీ - ఘజియాబాద్‌ -మేరఠ్‌ ఆర్ఆర్టీఎస్ కారిడార్‌లో సాహిబాబాద్‌, దుహై డిపో మధ్య సేవలందించే ర్యాపిడ్‌ఎక్స్‌ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్‌ 20న ప్రారంభించనున్నారు. తొలి విడతలో 17కి.మీల పరిధిలో 5 స్టేషన్ల మధ్య అక్టోబర్‌ 21 నుంచి ఈ రైలు సర్వీసులు నడవనున్నాయి.

ఢిల్లీ-ఘజియాబాద్‌-మేరఠ్‌ ఆర్‌ఆర్‌టీఎస్‌ కారిడార్‌కు ప్రధాని నరేంద్ర మోడీ 2019 మార్చి 8న శంకుస్థాపన చేశారు. 85.2 కి.మీ.ల మార్గం నిర్మాణాన్ని రూ.30వేల కోట్లతో చేపట్టారు. 2025 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రస్తుతం 17 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి కావడంతో దాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

ఇదిలా ఉంటే ర్యాపిడ్‌ఎక్స్‌ రైళ్ల పేరు నమో భారత్‌గా మార్చడంపై కాంగ్రెస్‌ మండిపడుతోంది. ముందు నమో స్టేడియం ఇప్పుడు నమో రైళ్లు. సొంత ప్రచారానికి హద్దు లేకుండా పోయిందంటూ కాంగ్రెస్ సీనియర్‌ నేత జైరాం రమేశ్ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. భారతదేశం పేరు కూడా అదే పేరుతో మార్చేస్తే సరిపోతుందని కదా అని మరో నేత పవన్ ఖేరా ట్వీట్ చేశారు.




Updated : 19 Oct 2023 4:14 PM GMT
Tags:    
Next Story
Share it
Top