Home > జాతీయం > రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్‌

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్‌

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్‌
X

దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు పెరుగుతున్న పెట్రోల్ ధరలను భరించలేక చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్‎కు ఆకర్షితులవుతున్నారు. దీంతో పెద్ద పెద్ద కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‎లో ఇంట్రడ్యూజ్ చేస్తోంది. డిమాండ్‎ను క్యాష్ చేసుకుంటున్నాయి. లేటెస్టుగా దేశీయ ప్రీమియం మోటార్‎సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. రెండేళ్లలో ఈ కంపెనీ నుంచి మొదటి విద్యుత్ బైక్ ను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సంస్థనే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది. అందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసింది. 1,50,000 ఉత్పత్తి కెపాసిటీతో కొత్త ప్లాంట్‎ను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.


రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కు భారత్ లో ఉన్న క్రేజే వేరు. యువతకు ఈ బైక్స్ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. వారి లైఫ్ లో ఒక్కసారైనా రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపాలని ఆశపడుతుంటారు. ఒక్క బైక్ ఆన్ రోడ్‏కు రావాలంటే నెలల తరబడి ఎదురు చూడాల్సిందే. అది రాయల్ ఎన్‌ఫీల్డ్ కు ఉన్న డిమాండ్. ప్రస్తుతం ఇండియాలోని మోటార్‌బైక్స్ మార్కెట్లో 90 శాతం వాటాతో ఫస్ట్ ప్లేస్‎లో నిలిచింది రాయల్ ఎన్‌ఫీల్ట్. అలాంటి సంస్థ ఇప్పుడు ఈవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. మార్కెట్ అవసరాలను అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు ఈ విద్యుత్ బైక్స్ ను రూపొందించబోతోంది సంస్థ. ప్రస్తుతం వీరి ఈవీ బైక్ పరీక్ష దశలో ఉంది. ఇది కనుక సక్సెస్ అయితే మాత్రం కస్టమర్లకు పండగే. వినియోగదారులను ఆశ్చర్యపరిచే విధంగా ఈవీ బైక్ రూపొందిస్తున్నట్లు సంస్థ ప్రతినిథులు చెబుతున్నారు.

Updated : 4 Aug 2023 2:45 PM GMT
Tags:    
Next Story
Share it
Top