Home > జాతీయం > జల్లికట్టు, కంబళను కాపాడుకుంటేనే సనాతన ధర్మం నిలుస్తుంది.. బీజేపీ ఎంపీ

జల్లికట్టు, కంబళను కాపాడుకుంటేనే సనాతన ధర్మం నిలుస్తుంది.. బీజేపీ ఎంపీ

జల్లికట్టు, కంబళను కాపాడుకుంటేనే సనాతన ధర్మం నిలుస్తుంది.. బీజేపీ ఎంపీ
X

సనాతన ధర్మాన్ని కాపాడేందుకు రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలన్నారు బెంగళూరు సౌత్ ఎంపీ, బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య . జల్లికట్టు, కంబాల వంటి సంప్రదాయ క్రీడలను ఆపేందుకు ‘కొన్ని శక్తులు’ ఎజెండాతో ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. బెంగుళూరులో నిర్వహిస్తున్న కంబళ ఆట పోటీలు ఆదివారం రెండోరోజుకు చేరుకోగా.. ఆ పోటీలకు ఎంపీ తేజస్వీ సూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంబళ, జల్లికట్టు ఆటలకు సనాతన ధర్మంతో లంకె ఉన్నదని వివరించారు. అన్ని పార్టీలు ఏకమై సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు. సాంప్రదాయ క్రీడలైన జల్లికట్టు, కంబళను ఆపడానికి కొన్ని శక్తులు ఒక ఎజెండా ప్రకారం పని చేస్తున్నాయని ఆరోపించారు.

‘కొన్ని శక్తులు ఒక ఎజెండాతో జల్లికట్టు, కంబళను ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. కోర్టులకు వెళ్లుతున్నాయని, ఇతర మార్గాల్లో ఈ క్రీడాలను ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి’ అని తేజస్వీ సూర్య అన్నారు. పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి జల్లికట్టు, కంబళను కాపాడుకోవాలని తెలిపారు. ఎందుకంటే ఈ క్రీడలను కాపాడుకుంటేనే సనాతన ధర్మాన్ని పరిరక్షించినవారం అవుతామని వివరించారు. సాధారణంగా కంబళ ఆటను కర్ణాటక తీర ప్రాంతాల్లో, కేరళలోని కాసర్‌గోడ్‌లో నిర్వహిస్తుంటారు. కంబళ బెంగుళూరులో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కంబళ రాష్ట్ర క్రీడా హోదాను దక్కించుకుంది.

Updated : 27 Nov 2023 5:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top