Home > జాతీయం > ఎలక్టోరల్ బాండ్స్ కేసు.. సీరియల్ నంబర్లు సమర్పించిన SBI

ఎలక్టోరల్ బాండ్స్ కేసు.. సీరియల్ నంబర్లు సమర్పించిన SBI

ఎలక్టోరల్ బాండ్స్ కేసు.. సీరియల్ నంబర్లు సమర్పించిన SBI
X

సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎట్టకేలకు దిగొచ్చిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఎలక్టోరల్‌ బాండ్స్‌ వివరాలను ఎలక్షన్ కమిషన్కు ఇటీవల సమర్పించింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను ఈసీ బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ ఇచ్చిన డేటాను.. అధికారిక వెబ్సైట్లో ఈసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 763 పేజీలు, రెండు పార్టులుగా ఉన్న ఈ లిస్ట్లో.. ఎవరెవరు ఎన్ని బాండ్లు కొనుగోలు చేశారని తెలిపింది. బాండ్లు కొనుగోలు చేసిన వాటిలో అనేక కార్పొరేట్ కంపెనీలు, ఇన్ఫ్రా, పవర్ కంపెనీలున్నాయి. ఈ బాండ్ల ద్వారా దేశంలోని పలు ప్రముఖ పొలిటికల్ పార్టీలకు నిధులు సమకూరాయి.

2019 ఏప్రిల్‌ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 దాకా.. ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్‌ బాండ్లను ఎస్బీఐ జారీ చేసింది. వీటిని పలు కంపెనీలు కొనుగోలు చేసి, రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చారు. 16,518 కోట్ల రూపాయలు విలువైన 22,030 బాండ్లను రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్నాయి. అయితే మొదట ప్రకటించిన డేటాలో ఎస్బీఐ సీరియల్ నెంబర్లు ప్రకటించలేదు. దీంతో ఈ విషయాన్ని ఈసీ.. సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఎస్బీఐపై సీరియస్ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించిన ఎస్బీఐ.. సీరియల్ నంబర్లతో కూడిన డేటాను ఈసీకి అందించింది. దీని వల్ల ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి ఎంత విరాళమిచ్చిందో తెలుసుకునే అవకాశం ఉంది.

Updated : 21 March 2024 11:07 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top