Home > జాతీయం > Sonia Gandhi : రాజస్థాన్లో సోనియాగాంధీ నామినేషన్

Sonia Gandhi : రాజస్థాన్లో సోనియాగాంధీ నామినేషన్

Sonia Gandhi : రాజస్థాన్లో సోనియాగాంధీ నామినేషన్
X

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ రాజ్యసభలో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాకుండా.. రాజ్యసభ బరిలో నిలిచేందుకు సోనియా గాంధీ ఆసక్తి చూపించారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా, ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సోనియా జైపూర్ కు చేరుకున్నారు. ఆమెతో పాటు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్, ప్రియాంకాగాంధీలు కూడా ఉన్నారు. అయితే ఇవాళ ఆమె తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలుకు రేపు చివరి తేది కాగా..27న ఎన్నికలు జరగనున్నాయి.

అయితే ఇప్పటికి ఐదు సార్లు లోక్ సభకు ఎన్నికైన సోనియాగాంధీ తొలిసారి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. ప్రస్తుతం ఆమె యూపీలోని రాయ్ బరేలీ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి ఆమె కూతురు ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

నామినేషన్ల దాఖలు సమయంలో సోనియాతో పాటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ ఉండనున్నట్లు సమాచారం. కాగా ఈనెల 27న 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది ఎంపీల పదవీకాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో, ఆయా స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాజస్థాన్ లో మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా..అందులో ఒకదాంట్లో కాంగ్రెస్ సులువుగా గెలుస్తుంది. అందుకే, సోనియా ఇక్కడి నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. సౌత్ లో తెలంగాణ, కర్ణాటక నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ... ఆమె రాజస్థాన్ నుంచి పోటీ చేయడానికే మొగ్గు చూపారు. మరోసారి లోక్ సభకు పోటీ చేయబోనని 2019లోనే సోనియా ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated : 14 Feb 2024 5:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top