Home > జాతీయం > Ayodhya : కాజీపేట నుంచి అయోధ్యకు స్పెషల్‌ ట్రైన్లు

Ayodhya : కాజీపేట నుంచి అయోధ్యకు స్పెషల్‌ ట్రైన్లు

Ayodhya : కాజీపేట నుంచి అయోధ్యకు స్పెషల్‌ ట్రైన్లు
X

రేపు జరిగే అయోధ్య శ్రీరాముల వారి ఆలయ విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవానికి వెళ్లేందుకు రైల్వేశాఖ భక్తులకు కాజీపేట నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నాది. ఈ నెల 30 తేదీ నుంచి ట్రైన్‌లు ప్రారంభం కానున్నాయి. కాజీపేటలో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి మరునాడు రాత్రి 09.35 గంటలకు అయోధ్య చేరుతుంది. అయోధ్యలో తిరిగి మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రారంభం అయి మళ్లీ కాజీపేటకు రాత్రి 7.02 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బల్లార్ష, చంద్రాపూర్‌, సేవాగ్రామం, నాగపూర్‌, జుజార్‌పూర్‌, ఇటార్సీ, బోపాల్‌, బినా, విరాంగన, ఝాన్సీ, ఒరాయ్‌, ఖాన్‌పూర్‌, అయోధ్య స్టేషన్లలో ఆగుతుంది.

ఇందులో 20 స్లీపర్‌ కోచ్‌లు 2 జనరల్‌ బోగీలు ఉంటాయి. సికింద్రాబాదు నుంచి అయోధ్యకు 07221 నెంబరుతో మరో ప్రత్యేక రైలు కూడా అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాదులో ఈనెల 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీలలో అందుబాటులో ఉంటుంది. అయోధ్య నుంచి ఇదే నెంబరుతో ఫిబ్రవరి 1, 3, 5, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, మార్చి 1, 3 తేదీలలో ఉంటుంది. సికింద్రాబాదు రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరునాడు రాత్రి 9.30 గంటలకు అయోధ్య చేరుతుంది. అయోధ్యలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు రాత్రి 16.10 గంటలకు చేరుతుంది. ఇది కూడా కాజీపేట నుంచి బయలు దేరు ఆస్తా ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక రైలు ఆగిన అన్ని స్టేషన్లలో ఆగుతుంది. ఉమ్మడి వరంగల్‌, సికింద్రాబాదు ప్రజలకు ఆస్తా అయోధ్య ప్రత్యేక రైలు అందుబాటులోకి రావడం మంచి సౌకర్యం అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు


Updated : 21 Jan 2024 4:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top