Home > జాతీయం > ఒంటరిగానే బరిలోకి...తృణమూల్ కాంగ్రెస్ సంచలన ప్రకటన

ఒంటరిగానే బరిలోకి...తృణమూల్ కాంగ్రెస్ సంచలన ప్రకటన

ఒంటరిగానే బరిలోకి...తృణమూల్ కాంగ్రెస్ సంచలన ప్రకటన
X

ఇండియా కూటమికి షాక్ ఇచ్చారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని పార్టీ స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకంపై క్లారిటీ వచ్చింది. పొత్తు, సీట్ల సర్దుబాటుపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిరిగి టచ్‌లోకి వచ్చిందని, చర్చలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ వర్గాలు తెలిపిన గంటల వ్యవధిలోనే ఆ పార్టీ సంచలన ప్రకటన చేసింది. సీట్ల గురించి తమ పార్టీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ కొన్ని వారాల క్రితమే స్పష్టత ఇచ్చారని ఆ పార్టీ సీనియర్ నేత డెరెక్ ఓబ్రిన్ తెలిపారు. అసోంలోని కొన్ని సీట్లు, మేఘాలయలోని తురా లోక్‌సభ స్థానంలో పోటీ విషయంలో కూడా ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు.

పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ కోరుతున్న స్థానాలను తగ్గించుకున్నప్పటికీ..తృణమూల్ కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. తృణమూల్‌కు అసోంలో 2, మేఘాలయలో ఒక సీటును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ హాస్తం ఆఫర్ చేసినా ఒప్పుకోలేదని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన ఇండియా కూటమికి ఎదురుదెబ్బ అని అంటున్నారు రాజకీయ నిపుణులు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకుంది కాంగ్రెస్. మిగతా రాష్ట్రాలపై కాంగ్రెస్ దృష్టిసారించిన వేళ జరిగిన ఈ పరిణామాన్ని ప్రతికూలంగా తీసుకొవాలని అంటున్నారు. కాగా ఢిల్లీ, హర్యానా, గోవా, గుజరాత్‌లలో పోటీపై గత కొన్ని రోజులుగా ఆప్‌తో కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది.

Updated : 24 Feb 2024 2:55 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top