Home > జాతీయం > Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
X

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరి జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా.. 21మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. బాధితులు గోద్ భరై కార్యక్రమం నుంచి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంపై సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి సంపతీయ ఉయికేని సీఎం ఆదేశించారు.


Updated : 29 Feb 2024 3:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top