Home > జాతీయం > ఒకే రన్ వేపై రెండు ఫ్లైట్లు.. ఢిల్లీ ఎయిర్పోర్టులో తప్పిన ప్రమాదం..

ఒకే రన్ వేపై రెండు ఫ్లైట్లు.. ఢిల్లీ ఎయిర్పోర్టులో తప్పిన ప్రమాదం..

ఒకే రన్ వేపై రెండు ఫ్లైట్లు.. ఢిల్లీ ఎయిర్పోర్టులో తప్పిన ప్రమాదం..
X

ఢిల్లీ ఎయిర్పోర్టులో తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. రెండు ఫ్లైట్లకు ఒకేసారి రన్ వే పైకి అనుమ‌తి ఇవ్వడంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ ప్లైట్ లోని మహిళా పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను అలర్ట్ చేయడంతో ప్రమాదం తప్పింది. దీంతో ఆ రెండు ఫ్లైట్లలో ఉన్న 400 మంది ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

విస్తారా ఎయిర్‌లైన్స్ కు చెందిన అహ్మదాబాద్ - ఢిల్లీ ఫ్లైట్ ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండైంది. అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆదేశాల మేరకు పైలెట్ పార్కింగ్ బే వైపు విమానాన్ని మళ్లించారు. ఇదే సమయంలో విస్తారా ఎయిర్ లైన్స్ కే చెందిన ఢిల్లీ - బాగ్డోగ్రా ఫ్లైట్ అదే రన్ వే నుంచి టేకాఫ్ తీసుకునేందుకు ఏటీసీ పర్మిషన్ ఇచ్చింది. ఈ విషయం గ్రహించిన అహ్మదాబాద్ - ఢిల్లీ ప్లైట్లోని ఉమెన్ పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను అలర్ట్ చేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఢిల్లీ - బాగ్డోగ్రా ఫ్లైట్ టేకాఫ్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేశారు.

ల్యాండైన విమానం పార్కింగ్ కు వెళ్లేందుకు అనుమతించిన విషయం మర్చిపోయిన ఏటీసీ అధికారులు టేకాఫ్ కు పర్మిషన్ ఇవ్వడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై విస్తారా ఎయిర్‌లైన్స్ ఇప్పటి వరకు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే ఏటీసీ నిర్లక్ష్యం డీజీసీఏ దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

Updated : 23 Aug 2023 9:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top