Home > జాతీయం > అక్కడ బుల్డోజర్​తో తొక్కిపడేశాం.. ఇక్కడ కూడా అదే జరుగుద్ది: యోగి

అక్కడ బుల్డోజర్​తో తొక్కిపడేశాం.. ఇక్కడ కూడా అదే జరుగుద్ది: యోగి

అక్కడ బుల్డోజర్​తో తొక్కిపడేశాం.. ఇక్కడ కూడా అదే జరుగుద్ది:  యోగి
X

తాను సీఎం కాకముందు యూపీలో మాఫియా, అక్రమ దందాలదే రాజ్యంగా ఉండేదని.. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు వచ్చాక వాటినిన బుల్డోజర్​తో తొక్కిపడేశామని చెప్పారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అదే జరుగుతుందని స్పష్టం చేశారు. మహబూబ్​నగర్​లో బీజేపీ నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్న ఆదిత్యనాథ్.. బీఆర్ఎస్ వీఆర్ఎస్​ తీసుకునే సమయం వచ్చిందన్నారు. పేపర్ లీకేజీల కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేకపోతోందని.. యూపీలో ఆరేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు.

కాంగ్రెస్ పాలనలో దేశంపై ఉగ్రవాద దాడులు, చొరబాట్లు ఉండేవని మోదీ అధికారంలోకి వచ్చాక అవేవీ లేవని చెప్పారు. భారత్​పై దాడికి, చొరబాట్లకు ఎవరూ సాహసించరని, ఒకవేళ చేస్తే మెరుపుదాడులు చేసి బదులిస్తామని వారికి తెలునని వివరించారు. సరిహద్దుల రక్షణను బలోపేతం చేయడంతో పాటు దేశంలో మౌలికల వసతుల కల్పనకు ఎన్నో పథకాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​ల ఉమ్మడి స్నేహితుడు ఎంఐఎం అని.. ముగ్గురు ఒకే తానులోని ముక్కలుగా అభివర్ణించారు. ఈ ముగ్గురిలో ఎవరికి ఓటు వేసినా ముగ్గురికీ వేసినట్లేనన్నారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఉచిత అయోధ్య రామ మందిర దర్శనం కల్పిస్తామన్నారు.

Updated : 26 Nov 2023 12:41 PM GMT
Tags:    
Next Story
Share it
Top