Home > జాతీయం > ఆర్టీసీ బంపర్ ఆఫర్.. నో టికెట్.. ఫ్రీగా తిరగొచ్చు

ఆర్టీసీ బంపర్ ఆఫర్.. నో టికెట్.. ఫ్రీగా తిరగొచ్చు

ఆర్టీసీ బంపర్ ఆఫర్.. నో టికెట్.. ఫ్రీగా తిరగొచ్చు
X

సోదరీ, సోదరీమణుల ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగను యావత్ భారతదేశం జరుపుకుంటుంది. రాఖీ కట్టిన అక్కా, చెల్లికి గిఫ్ట్ ఇస్తుంటారు సోదరులు. ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ లోని యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాఖీ పండుగ కానుకగా రాష్ట్ర మహిళలందరికీ ఉచిత బస్ ఫెసిలిటీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్ట్ 30 అర్థరాత్రి 12 గంటల నుంచి ఆగస్ట్ 31 అర్థరాత్రి 12 గంటల వరకు.. ఉత్తర ప్రదేశ్ లోని సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ సర్వీస్ కల్పిస్తున్నట్లు జాయింట్ సెక్రటరీ కళ్యాణ్ బెనర్జీ తెలిపారు.

గతేడాది మాదిరిగానే రక్షా బంధన్ సందర్భంగా ఈసారీ కూడా ఎస్‌పీవీ ద్వారా నడిచే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రకటన ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్ జిల్లాలతో సహా రాష్ట్రంలోని 14 జిల్లాల్లో మహిళలకు సిటీ బస్సుల్లో ఉచిత సర్వీస్ లభిస్తుంది. దీంతో పాటు వారణాసి, ఘజియాబాద్, అలీగఢ్‌లోని మహిళలు సైతం ఈ ఆఫర్ కు అర్హులు. అంతేకాకుండా మొరాదాబాద్, ఝాన్సీ, బరేలీ, గోరఖ్‌పూర్, షాజహాన్‌పూర్, ఆగ్రా, మధుర-బృందావన్‌లోని సిటీ బస్సుల్లోనూ ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Updated : 26 Aug 2023 11:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top