Home > జాతీయం > వీడసలు మనిషేనా.. సైకిల్‌ను ముట్టుకుందని చిన్నారిపై..

వీడసలు మనిషేనా.. సైకిల్‌ను ముట్టుకుందని చిన్నారిపై..

వీడసలు మనిషేనా.. సైకిల్‌ను ముట్టుకుందని చిన్నారిపై..
X

తన సైకిల్‌ను తాకిందనే కారణంతో ఐదేళ్ల చిన్నారిని పదునైన ఆయుధంతో గొంతు కోశాడు ఓ దుర్మార్గుడు. తీవ్ర గాయాలతో ఆ చిన్నారి.. నొప్పితో అరుస్తూ అక్కడికక్కడే చనిపోయింది. ఉత్తర్​ప్రదేశ్​లోని మహారాజ్​గంజ్​లో ఈ దారుణం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు జరిగిన ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిండితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మహారాజ్​గంజ్​లోని నిచ్లాల్ పోలీస్ స్టేషన్​ పరిధిలోని లేధి గ్రామంలో రిమ్‌జీమ్ అనే బాలిక తన స్నేహితులతో కలిసి తోటలో ఆడుకుంటున్నది. అదే సమయంలో గ్రామానికి చెందిన దీపక్(21) అనే యువకుడు అక్కడికి వచ్చాడు. ఆడుకుంటున్న సమయంలో బాలిక అక్కడున్న సైకిల్​ను తాకింది. దీన్ని చూసిన దీపక్ ఆ చిన్నారిని తిట్టి పంపేశాడు. కానీ ఆ చిన్నారి మరో సారి ఆ సైకిల్​ వద్దకు వచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు ఓ పదునైన ఆయుధంతో చిన్నారిని గొంతు కోసి హత్య చేశాడు. విషయం తెలుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని నిందితుడుని అరెస్ట్ చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు దీపక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి చిన్నారి హత్యకు ఉపయోగించిన పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించిన దీపక్​.. పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్తున్న సమయంలో కదులుతున్న పోలీసు వాహనం నుంచి దూకాడు. దీంతో అతనికి తీవ్ర గాయలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.




Updated : 20 Sep 2023 8:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top