Home > జాతీయం > హింస ఏ రూపంలో ఉన్నా సహించేది లేదు..రిషి సునాక్

హింస ఏ రూపంలో ఉన్నా సహించేది లేదు..రిషి సునాక్

హింస ఏ రూపంలో ఉన్నా సహించేది లేదు..రిషి సునాక్
X

ఖలిస్థానీ తీవ్రవాదం అంశంపై బ్రిటన్ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ స్పందించారు. హింస ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని ఆయన తాజాగా ఓ వార్తా ఛానెల్‎కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని అన్నారు రిషి సునాక్‌. ఈ ముప్పుకు ముగింపు కార్డు వేసేందుకు ఇరు దేశాలు ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నాయని తెలిపారు. జీ20 సమ్మిట్‎లో పాల్గొనేందుకు రిషి సునాక్ తన సతీమణితో సహా కలిసి ఇండియా వచ్చారు.

ఇంటర్వ్యూలో రిషి సునాక్ మాట్లాడుతూ.. "టెర్రరిజం, హింస ఏ రూపంలో ఉన్నా వాటికి బ్రిటన్‌లో స్థానంలేదు. అందుకే ఖలిస్థానీ మద్దతుదారుల అంశాన్ని ఓవర్‎కమ్ చేసేందుకు ఇండియాతో కలిసి పనిచేస్తున్నాం. ఈ మధ్యనే బ్రిటన్‌ డిఫెన్స్ మినిస్టర్ భారత్‌లో పర్యటించారు. ఈ తరహా హింసకు ముగింపు పలికేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి హింసాత్మక చర్యలు సరైనవి కావు. బ్రిటన్‌లో నేను దీనిని ఎట్టిపరిస్థితుల్లో సహించను.

ఓ హిందువుగా నేను గర్విస్తున్నాను. నేను ఓ హిందువుగానే పెరిగాను.ఇప్పటికీ అలాగే ఉన్నాను. వీలైనప్పుడల్లా దేవాలయాలకు వెళ్తాను. అంతే కాదు ఈ మధ్యనే రాఖీ పండుగను చేసుకున్నాము. ఇండియాకు రావడం పర్సనల్‎గా నాకెంతో ప్రత్యేకం, ప్రేమ. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని బాధ్యతల్లో ఇండియాకు వచ్చాను. భారత్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పచుకునే మార్గాలు కనుగొంటున్నాను. ఇక్కడ నిర్వహిస్తోన్న జీ20 సమ్మిట్ సక్సెస్ చేయడంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది" అని రిషి సునాక్‌ అన్నారు.

Updated : 8 Sep 2023 3:31 PM GMT
Tags:    
Next Story
Share it
Top