Home > జాతీయం > ఛత్తీస్ఘడ్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

ఛత్తీస్ఘడ్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

ఛత్తీస్ఘడ్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
X

ఛత్తీస్ఘడ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో ఆ రాష్ట్ర సీఎంగా విష్ణుదేవ్ సాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా అరుణ్ సావో, విజయ్ శర్మ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ న‌డ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ, ఛత్తీస్​గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ తదితరులు హాజరయ్యారు.

గతంలో విష్ణుదేవ్ సాయ్ ప్రధాని మోడీ తొలి కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1990 నుంచి ఛత్తీస్‌ఘఢ్ బీజేపీలో కీలక గిరిజన నేతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కూడా విష్ణుదేవ్‌కు దక్కింది. ఛత్తీస్‌గఢ్‌లో 29 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ చేయగా.. బీజేపీ 17 చోట్ల విజయం సాధించింది. దీంతో సీఎం అయ్యే అవకాశం విష్ణుదేవ్కు దక్కింది.


Updated : 13 Dec 2023 12:53 PM GMT
Tags:    
Next Story
Share it
Top