Home > జాతీయం > పీక కొరికి ప్రాణం తీసిన పెంపుడు ఒంటే..

పీక కొరికి ప్రాణం తీసిన పెంపుడు ఒంటే..

పీక కొరికి ప్రాణం తీసిన పెంపుడు ఒంటే..
X

సాధు జంతువని సాకితే ఆ ఒంటే.. యజమాని ప్రాణమే తీసింది. ప్రేమగా పెంచుకున్న ఓ ఒంటెకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన మహిళపై దాడి చేసి చంపేసింది. ఉత్తర్​ప్రదేశ్​లోని హాథ్రస్​ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒంటే తాగేందుకు నీళ్లు పెడుతుండగా.. యజమాని ప్రాణాలు తీసింది. మహిళ గొంతును నోటితో కరచుకొని.. రెండు దవడలతో పీక నొక్కేసింది. దీంతో ఊపిరాడక ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఒంటె దాడిలో చనిపోయిన మహిళను తోతా దేవిగా గుర్తించారు.





సస్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్గోయ్ గ్రామంలో పప్పు బఘేల్​, తోతా దేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు ఇంటి వద్ద ఒక ఒంటెను పెంచుకుంటున్నారు. తమ పొలానికి అవసరమైన వ్యవసాయ పనిముట్లు, ఇతర సామానులు మోసేందుకు దీన్ని వినియోగిస్తుంటారు. అయితే ఎప్పటిలాగే ఆదివారం మధ్యాహ్నం ఒంటెకు నీళ్లు పెట్టేందుకు వెళ్లింది తోతా దేవి. అదే సమయంలో ఆమెపై ఒంటె దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. దేవి అరుపులు విన్న చుట్టుపక్క నివాసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఒంటెను కర్రలతో కొట్టి దాని నోట్లో నుంచి దేవిని విడిపించారు. అయినా లాభం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందింది. ప్రేమగా పెంచుకున్న ఒంటె.. దేవి ప్రాణం తీయడంపై గ్రామస్తులందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.



Updated : 3 July 2023 6:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top