Home > జాతీయం > ఇంట్లో చెప్పకుండా యువకుడితో వచ్చేసింది.. చివరికిలా..

ఇంట్లో చెప్పకుండా యువకుడితో వచ్చేసింది.. చివరికిలా..

ఇంట్లో చెప్పకుండా యువకుడితో వచ్చేసింది.. చివరికిలా..
X

వారం రోజుల క్రితం చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిందా యువతి. తన వెంటే ఉంటాడనుకున్న యువకుడు.. ఆపదసమయంలో వదిలి వెళ్లేసరికి.. దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడిపింది. రాత్రంతా 12 గంటలపాటు మృత్యువుతో పోరాడింది. ఏమైంది? ఎలా జరిగింది? అని ప్రశ్నించగా.. ఆ యువకుడిని ఏమీ అనొద్దంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఏపీలోని : విశాఖనగర శివారు అప్పికొండ సాగర తీరంలో ఈ విచిత్ర సంఘటన జరిగింది.

దువ్వాడ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ యువతి (18) మరో యువకుడితో కలిసి ఈ నెల 2వ తేదీ నుంచి విశాఖపట్నంలోని అప్పికొండ శివాలయ పరిసరాల్లో ఉంటోంది. ఆదివారం సాయంత్రం ఈ ఇద్దరూ సరదాగా సాగర తీరానికి వెళ్లారు. అక్కడ రాళ్ల గుట్టలపై ఆమె సెల్ఫీ తీసుకుంటుండగా.. ఒక్కసారిగా ఎత్తు ప్రదేశం నుంచి జారి పడిపోయింది. తీవ్రగాయాలతో రాళ్ల గుట్టల మధ్య చిక్కుకొని ఉన్న ఆమెను చూడగానే.. ఆ యువకుడు అక్కడనుంచి పరారయ్యాడు. చిమ్మ చీకటి, జన సంచారం లేని ప్రదేశంలో రాత్రంతా మృత్యువుతో పోరాడింది.





సోమవారం ఉదయం బీచ్‌కు వచ్చిన కొందరు వ్యక్తులు యువతిని చూడగా.. అక్కడే ఉన్న గజ ఈతగాళ్ల సహాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు. యువతి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. ఏ జరిగిందని ప్రశ్నించగా.. కాలుజారి పడిపోయానని, పరారీలో ఉన్న యువకుడిని ఏం అనవద్దని చెబుతోంది. అంబులెన్సు సిబ్బంది యువతి తల్లికి సమాచారమివ్వగా.. తాము విశాఖ బయలుదేరి వస్తున్నట్లు పేర్కొన్నారు. కుమార్తె కనపడటంలేదని కొన్ని రోజుల క్రితమే బందరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు యువతి తల్లి తెలిపారు. కిడ్నాప్‌ కేసు నమోదు చేసినట్లు బందరు పీఎస్‌ నుంచి అంబులెన్స్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. దువ్వాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పరారీలో ఉన్న యువకుడికి ప్రమాదం జరిగిందని, అతను కూడా కేజీహెచ్‌లో ఉన్నట్లు సమాచారం.




Updated : 10 Oct 2023 5:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top