Home > క్రీడలు > WPL Auction : 165 మంది ప్లేయర్లు.. 30 బెర్తులు.. నేడే డబ్ల్యూపీఎల్‌‌‌‌ వేలం

WPL Auction : 165 మంది ప్లేయర్లు.. 30 బెర్తులు.. నేడే డబ్ల్యూపీఎల్‌‌‌‌ వేలం

WPL Auction : 165 మంది ప్లేయర్లు.. 30 బెర్తులు.. నేడే డబ్ల్యూపీఎల్‌‌‌‌ వేలం
X

డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్ సక్సెస్ అయింది. ఐదు టీమ్స్ తడబడ్డ ఈ టోర్నీలో ముంబై విజేతగా నలిచింది. ప్రస్తుతం రెండో ఎడిషన్ కు కీలక ముందడుగు పడింది. డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్ కోసం ప్లేయర్ల వేలం శనివారం ముంబై వేదికగా జరగనుంది. ఐదు జట్లలో మొత్తం 30 బెర్తులు ఖాళీ ఉండగా.. వీటికోసం మొత్తం 165 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొననున్నారు. ఇందులో 104 మంది ఇండియన్స్ కాగా.. 61 మంది ఫారిన్ ప్లేయర్లు ఉన్నారు. పోయిన సీజన్ లో పాయింట్స్ టేబుల్ లో చివరి ప్లేస్‌‌‌‌ తో సరిపెట్టుకున్న గుజరాత్ జెయింట్స్‌‌‌‌, నాలుగో స్థానంలో నిలిచిన రాయల్‌‌‌‌ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ వేలంలో మెరుగైన ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది. దీంతో మంచి ప్లేయర్లపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది.

ఫారినర్స్‌‌‌‌లో రూ. 50 లక్షల బేస్‌‌‌‌ప్రైజ్ కేటగిరీలో బరిలో నిలిచిన వెస్టిండీస్ క్రికెటర్ దియేంద్ర డాటిన్, రూ. 40 లక్షల బేస్‌‌‌‌ ప్రైజ్‌‌‌‌లోని ఆసీస్ ఆల్‌‌‌‌రౌండర్లు అనాబెల్ సదర్లాండ్స్‌‌‌‌, జార్జియా వారెహామ్, సఫారీ క్రికెటర్ షబ్నిమ్ ఇస్మాయిల్, ఇంగ్లండ్ కీపర్ అమీ జోన్స్‌ లపై అన్ని జట్లు ఫోకస్‌‌‌ పెట్టాయి. గత మ్యాచుల్లో అద్భుతంగా రాణించిన ఈ ప్లేయర్లను.. సొంతం చేసుకునేందుకు ఫ్రాంచేజీలన్నీ పోటీ పడే అవకాశం ఉంది. డానీ వ్యాట్, టామీ బ్యూమోంట్, చామరి ఆటపట్టు, డిక్లెర్క్, ఇండియన్స్‌‌‌‌ వేదా కృష్ణమూర్తి, పూనమ్ రౌత్‌‌‌‌, సుష్మా వర్మ, ఏక్తా బిస్త్‌‌‌‌ లపై కూడా ఫేవరెట్లుగా కనిపిస్తున్నారు.




Updated : 9 Dec 2023 7:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top