Home > క్రీడలు > India vs England : మూడో టెస్టులో ఇంగ్లండ్ ఆలౌట్.. లీడ్ ఎంతంటే?

India vs England : మూడో టెస్టులో ఇంగ్లండ్ ఆలౌట్.. లీడ్ ఎంతంటే?

India vs England  : మూడో టెస్టులో ఇంగ్లండ్ ఆలౌట్.. లీడ్ ఎంతంటే?
X

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు ఆదరగొట్టారు. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌట్ చేశారు. బ్యాటింగ్‌లో బెన్ డకెట్ 153, స్టోక్స్ 41,పోప్ 39 రన్స్ చేశారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్4 వికెట్లు తీయగా రవీంద్ర జాడేజా, కుల్ధీప్ చేరో 2 వికెట్లు తీశారు. బుమ్రా, అశ్విన్ తలో వికెట్ తీశారు. భారత్ 126 పరుగుల అధిక్యంలో ఉంది.





రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులకు ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. లంచ్ త‌ర్వాత‌ భార‌త బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో ట‌ప‌ట‌పా వికెట్లు కోల్పోయి 319 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యింది. పేస‌ర్ సిరాజ్(Siraj) నాలుగు వికెట్ల‌తో ఇంగ్లండ్ ప‌త‌నాన్ని శాసించాడు. దాంతో, టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం ల‌భించింది. లంచ్‌కు ముందు 290/ 5తో ప‌టిష్ట స్థితిలో క‌నిపించిన స్టోక్స్ సేన అనూహ్యంగా మ‌రో 29 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది.






Updated : 17 Feb 2024 8:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top