Home > క్రీడలు > పిడుగుపాటుతో గ్రౌండ్ లోనే చనిపోయిన ఫుట్ బాల్ ప్లేయర్..వీడియో వైరల్

పిడుగుపాటుతో గ్రౌండ్ లోనే చనిపోయిన ఫుట్ బాల్ ప్లేయర్..వీడియో వైరల్

పిడుగుపాటుతో గ్రౌండ్ లోనే చనిపోయిన ఫుట్ బాల్ ప్లేయర్..వీడియో వైరల్
X

గ్రౌండ్ లో ఆసక్తికరంగా ఫుట్ బాల్ మ్యాచ్ సాగుతోంది. మైదానంలోని ఆడియన్స్ వారి వారి అభిమాన టీమ్ లను చీర్ చేస్తున్నారు. ఇంతలో అక్కడ జరిగిన ఘటన చూసి అక్కడ ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. ఇండోనేసియాలో ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్ లో ఒక్కసారిగా పిడుగుపడింది. దీంతో మ్యాచ్ ఆడుతున్న ఓ ప్లేయర్ నిలుచున్న చోటే అక్కడికక్కడే కుప్పకూలాడు. క్షణాల్లో జరిగిపోయిన ఈ ఘటనను చూసి అక్కడి వారంతా షాక్ కు గురైయ్యారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి కెమెరాల్లో రికార్డయింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పటి వరకు సంతోషంగా ఆడుతూ తమ జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న సహచరుడు క్షణాలలో నిర్జీవంగా మారడంతో ప్లేయర్లు షాక్ కు గురైయ్యారు. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు కూడా కాసేపటి వరకు ఏం జరిగిందో అర్థం కాలేదు. పిడుగు పడి ప్లేయర్ చనిపోయాడన్న వార్త తెలియడంతో వారంతా ఆశ్చర్యపోయారు.

ఆదివారం ఎఫ్ సీ బాండుంగ్, ఎఫ్ బీఐ సుబాంగ్ జట్ల మధ్య వెస్ట్ జావాలోని సిలివాంగి స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్ల సభ్యులు గోల్ కొట్టేందుకు పోటాపోటీగా మ్యాచ్ ఆడుతున్నారు. గోల్ కొట్టేందుకు గ్రౌండ్ లో నడుచుకుంటూ వెళుతున్న ఓ ప్లేయర్ పై సడన్ గా పిడుగు పడింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తన తోటి ప్లేయర్లు సహచరుడి దగ్గరకు హుటాహుటిన పరుగెత్తుకెళ్లారు. సీపీఆర్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.

Updated : 12 Feb 2024 8:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top