Home > క్రీడలు > కొత్త వ్యాపారం ప్రారంభించిన కోహ్లీ దంపతులు

కొత్త వ్యాపారం ప్రారంభించిన కోహ్లీ దంపతులు

కొత్త వ్యాపారం ప్రారంభించిన కోహ్లీ దంపతులు
X

సెలబ్రిటీ దంపతులు విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. కార్యక్రమాల(ఈవెంట్)కు ప్రచారం కల్పించే వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్టు విజయదశమి రోజున ప్రకటించారు. అధిక ప్రభావం చూపించగలిగే కార్యక్రమాలకు కోహ్లీ ప్రచారం తీసుకురానున్నాడు. ఈ వ్యాపారం కోసం ‘నిసర్గ’ అనే వెంచర్ ను ప్రారంభించారు. ఎలైట్ ఆక్టేన్ అనే సంస్థతో నిసర్గ ఒప్పందం కూడా కుర్చుకుంది. మోటార్ స్పోర్ట్స్, ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాల నిర్వహణలో ఎలైట్ ఆక్టేన్ సేవలు అందిస్తోంది. ‘ద వ్యాలీ రన్’ తదితర మేథో సంపత్తి హక్కులు ఎలైట్ ఆక్టేన్ కు ఉన్నాయి. మోటార్ స్పోర్ట్స్, ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో కొత్త ప్లాట్ ఫామ్ లను అమలు చేయడంలో ఎలైట్ ఆక్టేన్ కీలక పాత్ర పోషిస్తోంది.

క్రికెట్ నుంచి వచ్చే ఆదాయానికి తోడు, ప్రకటనల్లో కనిపించడం, బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం ద్వారా పెద్ద మొత్తంలో సమకూర్చుకుంటున్నాడు కోహ్లీ. పలు వ్యాపారాల్లోనూ అతడికి పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పుడు భార్య అనుష్క శర్మతో కలసి ఈ కొత్త వ్యాపారానికి ప్లాన్ చేశాడు. ఎలీట్‌ ఆక్టేన్‌కు ది వేలీ రన్‌ వంటి ఈవెంట్లకు సంబంధించి మేథోహక్కులు (ఐపీ) ఉన్నాయి. ప్రస్తుతం మూడు మోటార్‌స్పోర్టింగ్‌ ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు, ఒక మ్యూజిక్‌ కాన్సర్ట్‌ మొద లైనవి నిర్వహించనున్నట్లు నిసర్గ పేర్కొంది. ఈ సంస్థకు సీఈవోగా తాహా కోబర్న్‌ కూటే, సీవోవోగా అంకుర్‌ నిగమ్‌ నియమితులయ్యారు.




Updated : 25 Oct 2023 5:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top