Home > క్రీడలు > IND vs ENG : ఆఖరి టెస్ట్​కు రోహిత్ శర్మ దూరం! కెప్టెన్​గా ఆ స్టార్ ప్లేయర్

IND vs ENG : ఆఖరి టెస్ట్​కు రోహిత్ శర్మ దూరం! కెప్టెన్​గా ఆ స్టార్ ప్లేయర్

IND vs ENG : ఆఖరి టెస్ట్​కు రోహిత్ శర్మ దూరం! కెప్టెన్​గా ఆ స్టార్ ప్లేయర్
X

సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా దూసుకుపోతుంది. సీనియర్లు లేకపోయినా రోహిత్ శర్మ సారథ్యంలో కుర్రాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దాంతో మరోమ్యాచ్ మిగిలుండగానే భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. అయితే మార్చి 7 నుంచి జరగబోయే చివరి టెస్టుకు భారత అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తుంది. లాస్ట్ టెస్ట్ కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు. చాలాకాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. సీనియర్లు లేని లోటును తన భుజానేసుకుని తీర్చుతున్నాడు. ఈ క్రమంలో అతనికి రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తుంది. ఎలాగూ సిరీస్ గెలిచాం కాబట్టి వచ్చే మ్యాచ్ లో రోహిత్ రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు.

అయితే రోహిత్ లేని లోటును స్పీడ్ స్టర్ బుమ్రా తీర్చనున్నాడు. నాలుగో టెస్టుకు రెస్ట్ తీసుకున్న బుమ్రా.. చివరి టెస్టులో తిరిగి జట్టులోకి రానున్నాడు. దీంతో వైస్ కెప్టెన్ గా ఉన్న బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే బ్యాటర్ గా రోహిత్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ క్రమంలో రజత్ పటిదార్ కు మరో అవకాశం వచ్చే చాన్స్ ఉంది. యంగ్ స్టర్ దేవ్ దత్ పడిక్కల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే చివరి టెస్టులో భారత్ పూర్తిగా యువ జట్టుతో బరిలోకి దిగుతుంది. అయితే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్స్ కు అర్హత సాధించాలంటే ప్రతీ టెస్టు కీలకం. అలాంటి టైంలో బీసీసీఐ ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటుందో చూడాలి.

Updated : 28 Feb 2024 4:15 PM GMT
Tags:    
Next Story
Share it
Top