Home > క్రీడలు > Shikhar Dhawan Divorce: ఎట్టకేలకు శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరు చేసిన కోర్టు

Shikhar Dhawan Divorce: ఎట్టకేలకు శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరు చేసిన కోర్టు

Shikhar Dhawan Divorce: ఎట్టకేలకు శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరు చేసిన కోర్టు
X

తన భార్య మానసికంగా హింసిస్తోందంటూ టీమ్‌ఇండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan).. ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన కోర్టు.. వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా భార్య ఆయేషా ముఖర్జీపై ధావన్‌ చేసిన ఆరోపణలను కోర్టు సమర్థించింది. ఆయేషా క్రూర ప్రవర్తన కారణంగానే విడాకులు మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది.

గత కొంత కాలంగా ధావన్ భార్యకు దూరంగా ఉంటున్నాడు. రెండేళ్ల క్రితమే తాము విడిపోతున్నట్లు ధావన్‌ దంపతులు ప్రకటించారు. విడాకుల కోసం ధావన్ పిటిషన్ దాఖలు చేయగా.. గత మంగళవారం కోర్టు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా.. ‘‘తన ఒక్కగానొక్క కుమారుడికి దూరంగా ఉండాలని ధావన్‌ను అతడి భార్య మానసికంగా వేధించింది. తొలుత శిఖర్‌ ధావన్‌తో కలిసి భారత్‌లో ఉండేందుకు ఒప్పుకున్న ఆయేషా.. ఆ తర్వాత తన మొదటి భర్తతో కలిగిన సంతానాన్ని చూసుకునేందుకు ఆస్ట్రేలియాలోనే ఉండిపోయింది. దీంతో ధావన్‌ తన కుమారుడికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక ధావన్‌ తన సొంత డబ్బుతో ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసిన 3 ఆస్తులపై తనకు హక్కులు కల్పించాలని ఆమె ఒత్తిడి చేసినట్లు కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఒక ఆస్తిలో 99శాతం వాటా, మిగతా రెండు ఆస్తుల్లో సహ యాజమాన్యం కావాలని ఆమె డిమాండ్‌ చేసినట్లు ధావన్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ ఆరోపణలను ఆమె వ్యతిరేకించలేదు. అందువల్ల ఇవన్నీ వాస్తవమేనని కోర్టు గుర్తించింది’’ అని న్యాయస్థానం తమ తీర్పు సందర్భంగా వెల్లడించింది.

ధావన్‌ చేసిన ఆరోపణలన్నీ నిజమని తేలడంతో కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. అయితే, తన కుమారుడి శాశ్వత కస్టడీ కోసం ధావన్‌ చేసిన అభ్యర్థనపై తీర్పు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కానీ, ధావన్ తన కుమారుడితో వీడియో కాల్‌ ద్వారా టచ్‌లో ఉండేందుకు అనుమతించింది. స్కూల్‌ వెకేషన్‌ సమయంలో ఆయేషా తన కుమారుడిని భారత్‌కు తీసుకొచ్చి ధావన్‌ కుటుంబంతో సమయం గడిపేలా చూడాలని కోర్టు ఆదేశించింది.

Updated : 5 Oct 2023 8:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top