Home > క్రీడలు > IND vs ENG : భారత బౌలర్ల దెబ్బకు విలవిల్లాడుతోన్న ఇంగ్లాండ్

IND vs ENG : భారత బౌలర్ల దెబ్బకు విలవిల్లాడుతోన్న ఇంగ్లాండ్

IND vs ENG : భారత బౌలర్ల దెబ్బకు విలవిల్లాడుతోన్న ఇంగ్లాండ్
X

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ బౌలర్లు చెలరేగారు. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు భారత బౌలర్ల దెబ్బకు 50పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జాక్ క్రాలీ, బెన్ డకెట్, రూట్, బెయిర్ స్టో,ఒల్లీ పోప్, బెన్ స్టోక్స్, రెహాన్ అహ్మద్ వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టారు. ఒక్కరు కూడా 15 రన్స్ కు మించి చేయలేదు. 3 కీలక వికెట్లతో జడేజా ఇంగ్లీష్ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. జో రూట్, బెయిర్ స్టో,ఒల్లీ పోప్ వికెట్లను పడగొట్టి.. ఆ జట్టు పతనాన్ని శాసించాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఒక వికెట్ తీశాడు.

అంతకుముందు భారత రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. జైశ్వాల్ (214) డబుల్ సెంచరీతో చెలరేగడంతో 430 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఓవరాల్గా 556 లీడ్ సాధించింది. 231బంతుల్లోనే జైశ్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. రెండో టెస్టులో ఇంగ్లాడ్పై డబుల్ సెంచరీ చేసిన అతడు.. మూడో టెస్టులోనూ అదే రిపీట్ చేశాడు. దీంతో సొంత గడ్డపై ఒక సిరీస్‌లో 500+ రన్స్‌ చేసిన రెండో భారత బ్యాటర్‌ జైస్వాల్గా నిలిచాడు. 534 పరుగులతో మొదటి స్థానంలో గంగూలీ ఉన్నాడు. ఇక గిల్ 91 రన్స్ వద్ద రనౌట్ అవ్వడంతో సెంచరీ మిస్ అయ్యింది.

Updated : 18 Feb 2024 10:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top