విజృంభించిన భారత్ అమ్మాయిలు
X
థంబ్ : 34 పరుగులకే ఆలౌట్..!
ఏసీసీ వుమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్లో ఇండియా వుమెన్స్-ఏ జట్టు విజృంభించింది. మొదటి మ్యాచ్లో పసికూన హాంకాంగ్ను చిత్తుచేసింది. భారత్ బౌలర్లు చెలరేగడంతో హాంకాంగ్ 14 ఓవర్లలో కేవలం 34 పరుగుకులకే కుప్పకూలింది. యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఐదు వికెట్లు సాధించింది. పార్శవీ చోప్రా, మన్నత్ కశ్యప్లు తలా రెండు వికెట్లు పడగొట్టగా.. తిటాస్ సాదు ఒక వికెట్ తీయడంతో బ్యాటింగ్లో హాకాంగ్ తేలిపోయింది. ఆ టీమ్లో 14 పరుగులు చేసిన మరికో హిల్ టాప్ స్కోరర్. మిగతా పది మంది సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అందులో నాలుగు డకౌట్లు ఉన్నాయి. 35 పరుగులు లక్ష్యాన్ని ఇండియా-ఏ వుమెన్స్ 5.2 ఓవర్లలో వికెట్ నష్టపోయి చేధించింది. తెలంగాణ అమ్మాయి గొంగిడి త్రిష 19, ఉమా చెత్రీ 16 పరుగులు చేశారు.
INDIA-A Women Beat Hong Kong By 9 Wickets
ACC Women's T20 Emerging Asia Cup,INDIA-A Women, Beat Hong Kong, 9 Wickets,Hong Kong 34 all out,Shreyanka Patil Wickets