Home > క్రీడలు > India Vs England : విశాఖ టెస్ట్‌లో ఇంగ్లండ్ చిత్తు..భారత్ ఘన విజయం

India Vs England : విశాఖ టెస్ట్‌లో ఇంగ్లండ్ చిత్తు..భారత్ ఘన విజయం

India Vs England : విశాఖ టెస్ట్‌లో ఇంగ్లండ్ చిత్తు..భారత్ ఘన విజయం
X

(India Vs England) విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి టెస్ట్‌లో టీమిండియా పరాజయం పొందింది. తాజాగా ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును భారత్ చిత్తుగా ఓడించింది. 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 292 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో భారత జట్టు ఘన విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో భారత్ 1-1తో సిరీస్‌ను స‌మం చేసింది.





రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లను భారత బౌలర్లు కట్టడి చేశారు. స్పిన్నర్లు అశ్విన్, కుల్దీప్ విజృంభించడంతో మొదటి సెషన్‌లోనే ఇంగ్లండ్ జట్టు 6 వికెట్లను కోల్పోయింది. అలాగే లంచ్ బ్రేక్‌కు ముందుగా బెయిర్‌స్టోను 26 పరుగులకు బుమ్రా ఔట్ చేశాడు. దీంతో లంచ్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 194 పరుగులను మాత్రమే ఇంగ్లండ్ జట్టు చేయగలిగింది. ఆ తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 11, టామ్ హార్టే 36, బెన్ ఫోక్స్ 36 పరుగులకు ఔట్ అయ్యారు. దీంతో భారత బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను పెవిలియన్ దారి పట్టిస్తూ టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించారు.



Updated : 5 Feb 2024 9:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top