Home > క్రీడలు > Virat Kohli : ఇంగ్లాండ్తో మరో రెండు టెస్ట్లకు కోహ్లీ దూరం...5వ టెస్ట్ కూడా డౌటే?

Virat Kohli : ఇంగ్లాండ్తో మరో రెండు టెస్ట్లకు కోహ్లీ దూరం...5వ టెస్ట్ కూడా డౌటే?

Virat Kohli : ఇంగ్లాండ్తో మరో రెండు టెస్ట్లకు కోహ్లీ  దూరం...5వ టెస్ట్ కూడా డౌటే?
X

ఇంగ్లాండ్ తో జరగబోయే మిగతా టెస్టులకూ టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(kohli) దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ లకు దూరం అయిన ఆయన...మిగిలిన 3 టెస్టులకు కూడా అందుబాటులో ఉండరని టాక్ వినిపిస్తోంది. అయితే మిగతా మ్యాచ్‌ల్లో ఆడతాడా లేదా అనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. కోహ్లి రాజ్‌కోట్, రాంచీ టెస్టులకు దూరంగా ఉండనున్నాడని తెలుస్తోంది. ఇక చివరి టెస్టులో ఆడడంపై కూడా డౌట్ గానే ఉందని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో ( ESPNCricinfo) రిపోర్ట్ తెలిపింది. విరాట్ తొలి రెండు టెస్ట్ లకు తప్పుకున్నట్టు బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా విరాట్ కోహ్లీ రెండవసారి తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని విరాట్ క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ఇటీవలే తెలిపాడు.

అయితే ఇంగ్లాండ్ తో జరగనున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలలో ఒకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇద్దరి మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు విశ్లేశిస్తున్నాయి. దాదాపు వన్ వీక్ గ్యాప్ తర్వాత మ్యాచ్ ఆరంభం కానుండడంతో ఇద్దరూ జట్టుకి అందుబాటులోకి రానున్నారని తెలిపింది. జడేజా, రాహుల్ ఇద్దరూ కూడా తొలి టెస్టులో గాయాలపాలయ్యారు. దీంతో రెండవ టెస్టుకు దూరమయ్యారు. కాబట్టి ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభిస్తే ఇద్దరిలో కనీసం ఒకరినైనా తిరిగి తీసుకునేందుకు అవకాశం ఉందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ బెంగళూరులోని ఎన్‌సీఏలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరోవైపు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ మూడో టెస్టుకు తిరిగి అందుబాటులోకి రానున్నాడు. రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న సిరాజ్ అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తోంది. కాగా మూడవ టెస్టు ఫిబ్రవరి 15న రాజ్‌కోట్ లో జరగనుంది.

Updated : 8 Feb 2024 1:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top