Home > క్రీడలు > India vs South Africa : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 55కే కుప్పకూల్చారు

India vs South Africa : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 55కే కుప్పకూల్చారు

India vs South Africa : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 55కే కుప్పకూల్చారు
X

కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో నెగ్గి సిరీస్ ను సమం చేయాలని చూస్తుంది టీమిండియా. తొలి ఇన్నింగ్స్ లో చెలరేగిన భారత్ బౌలర్లు.. పేస్ అటాక్ తో సౌతాఫ్రికాకు చుక్కలు చూపించారు. కట్టుదిట్టంగా బంతులు వేస్తూ సౌతాఫ్రికాను అడ్డుకున్నారు. దీంతో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. కాగా టెస్ట్ చరిత్రలో భారత్ లేదా ఇతర ఏ దేశంతోనైనా.. సౌతాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. కీలక మ్యాచ్ లో రెచ్చిపోయిన సిరాజ్ నిప్పులు చెరిగాడు. తన కెరీర్ బెస్ట్ 6-15 (9 ఓవర్లలో) నమోదుచేసుకున్నాడు. ప్రొటీస్ పతనానికి ముఖ్య కారకుడయ్యాడు. గత మ్యాచ్ లో సెంచరీ హీరో, కెప్టెన్ డీన్ ఎల్గర్ (4)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఐడెన్ మార్క్రమ్ ను (2) స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. టోనీ డి జోర్జీ (2)ని కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

ఆ తర్వాత డేవిడ్‌ బెడింగ్‌హామ్‌ (12), కైల్‌ వెర్రీన్నె (15), మార్కో జాన్‌సెన్ (0)ల వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టి.. సౌతాఫ్రికా పతనంలో భాగస్వామ్యులయ్యారు. భారత బౌలర్ల దెబ్బకు సౌతాఫ్రికా బౌలర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ కు క్యూ కట్టారు. డేవిడ్‌ బెడింగ్‌హామ్‌, కైల్‌ వెర్రీన్నె మినహా ఏ బ్యాటర్ కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు.

Updated : 3 Jan 2024 10:37 AM GMT
Tags:    
Next Story
Share it
Top