Home > క్రీడలు > సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌.. భారత జట్టు ఇదే.. యువ సంచలనం ఎంట్రీ

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌.. భారత జట్టు ఇదే.. యువ సంచలనం ఎంట్రీ

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌.. భారత జట్టు ఇదే.. యువ సంచలనం ఎంట్రీ
X

వరల్డ్ కప్ తర్వాత టీమిండియా పూర్తిగా బిజీ అయిపోయింది. వరుస సిరీస్ లతో తర్వాతి మెగా టోర్నీలకు సిద్ధం అవుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడుతుంది. ఆ వెంటనే సౌతాఫ్రికా టూర్ కు వెళ్లనుంది. ఈ టూర్ లో భాగంగా మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే, రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. కాగా ఈ టూర్ కోసం సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇవాళ జట్టును ప్రకటించింది.

సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లకు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ దూరం కాగా.. ఈ నలుగురు తిరిగి టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక టీ20లకు సూర్యకుమార్‌ యాదవ్‌ భారత జట్టు సారథిగా ఎంపిక కాగా.. వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌కు భారత జట్టు పగ్గాలు అప్పగించారు. దేశవాళీలో అద్భుతంగా రాణించిన తమిళనాడు ఆటగాడు సాయి సుదర్శన్ కు తొలిసారి పిలుపు వచ్చింది. వన్డే జట్టులో అతనికి చోటు కల్పించింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో కూడా అద్భుతంగా రాణించి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్ కూడా దక్కించుకున్నాడు.

భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ లియర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్‌) (వారం), సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్




Updated : 30 Nov 2023 4:32 PM GMT
Tags:    
Next Story
Share it
Top