Home > క్రీడలు > రెండో రోజు ముగిసిన ఆట.. స్వల్ప ఆధిక్యంలో సఫారీ టీం..

రెండో రోజు ముగిసిన ఆట.. స్వల్ప ఆధిక్యంలో సఫారీ టీం..

రెండో రోజు ముగిసిన ఆట.. స్వల్ప ఆధిక్యంలో సఫారీ టీం..
X

భారత్తో జరుగుతోన్న ఫస్ట్ టెస్టులో సౌతాఫ్రికా నిలకడగా ఆడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు 256/5 రన్స్ చేసింది. సరైన వెలుతురు లేకపోవడంతో 66 ఓవర్ల వద్ద ఆటను నిలిపేశారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. డీన్ ఎల్గర్ సెంచరీతో అదరగొట్టగా.. డేవిడ్ బెడింగ్‌హమ్ అర్ధ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం డీన్ ఎల్గర్‌ (140 ), మార్కో జాన్సన్‌ (3) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 2, సిరాజ్ 2, ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 245 రన్స్కు ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా బౌలర్లు రెచ్చిపోవడంతో.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుదేలయింది. ఓవర్‌నైట్‌ 208/8 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ 8.4 ఓవర్లలో 37 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్ భారత్ను సెంచరీతో ఆదుకున్నాడు. వరుస వికెట్లు పడుతున్నా టీమిండియాను తన అద్భుత బ్యాటింగ్తో నిలబెట్టాడు. ఓపెనర్ రోహిత్ శర్మ (5, 14 బంతుల్లో), యశస్వీ జైశ్వాల్ (17, 37 బంతుల్లో) ఫెయిల్ అయ్యారు. దీంతో టీమిండియా 23 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వరుస వికెట్లు పడుతున్నా కేఎల్ రాహుల్ మాత్రం నిలకడగా ఆడి భారత్కు చెప్పుకోదగ్గ స్కోర్ను అందించాడు. ఇక సఫారీ బౌలర్లలో రబాడా 5 వికెట్లు పడగొట్టగా.. నాండ్రే బర్గర్ 3, జాన్సన్, కోయెట్జీ చెరో వికెట్ తీశారు.

Updated : 27 Dec 2023 4:25 PM GMT
Tags:    
Next Story
Share it
Top