Home > క్రీడలు > Manoj Tiwari : నన్ను ఎందుకు తప్పించారో ధోనీని అడగాలనుకుంటున్నా..మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు

Manoj Tiwari : నన్ను ఎందుకు తప్పించారో ధోనీని అడగాలనుకుంటున్నా..మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు

Manoj Tiwari : నన్ను ఎందుకు తప్పించారో ధోనీని అడగాలనుకుంటున్నా..మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు
X

టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రంజీట్రోఫీలో బీహార్‌పై బెంగాల్ తరపున చివరి మ్యాచ్ ఆడి క్రికెట్ కెరియర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011లో సెంచరీ చేసిన తర్వాత కూడా తుది జట్టు నుంచి తనను ఎందుకు తీసేసారో మాజీ కెప్టెన్ ధోనీని అడగాలనుకుంటున్నానని మనోజ్ అన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాగా హీరో అయ్యే సత్తా తనకు ఉందని, కానీ అలా కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ రోజుల్లో చాలా మంది మాజీ క్రికెటర్లకు టీవీల్లో కూడా అవకాశాలు వస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో తనకు బాధగా ఉందని విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు బీహార్‌తో చివరి మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమంలో మనోజ్ తివారీ మాట్లాడాడు.

ఐపీఎల్ ద్వారా క్రికెటర్లను నిర్ణయించడంపై తివారీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. యంగ్ క్రికెటర్లు ఐపీఎల్‌ను ప్రాధాన్యంగా భావిస్తుండడం తాను గమనించినట్లు చెప్పాడు. ఐపీఎల్ ఆడని వారు ఖాళీ టైంలో దుబాయ్, ఇతర ప్రదేశాలకు వెళ్లి ఆడుతుంటారని, అయితే ఇది ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ ప్రాముఖ్యతను తగ్గిస్తుందని తెలిపాడు. ఇప్పుడు తాను ఏదైనా మాట్లాడిన అది నిషేధానికి దారితీయవచ్చునని అన్నాడు. సోషల్ మీడియాలో కేవలం ఒక పోస్ట్ పెట్టినందుకు తన మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారని బాధపడ్డాడు. కాగా రంజీ ట్రోఫీని రద్దు చేయాలంటూ మనోజ్ తివారీ ఇటీవలే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఇందుకు గల కారణాలను ఆయన వివరించలేదు. దీంతో అతనికి మ్యాచ్‌ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు.

కాగా బీసీసీఐని ప్రస్తుతం క్రీడాకారులు కాకుండా..రాజకీయ నాయకులు నడుపుతున్నారని ఆరోపించాడు. బీసీసీఐని ఇకపై ఆటగాళ్లు పాలించరని, రాజకీయ నాయకులతో నడిపిస్తారని విమర్శించాడు. తనకు కూడా రాజకీయ పార్టీతో సంబంధం ఉందని, కాబట్టి తాను క్రీడాకారుడినని చెప్పుకొచ్చాడు. రంజీ ట్రోఫీకి ప్రాధాన్యత ఇవ్వాలని తాను కోరుకుంటున్నానని, ఎందుకంటే ఈ ట్రోఫీ క్రమంగా ప్రాముఖ్యతను కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా మనోజ్ తివారీ 19 ఏళ్లపాటు బెంగాల్‌ తరపున క్రికెట్ ఆడాడు. బెంగాల్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఇక టీమిండియా తరపున 12 వన్డేలు, 3 టీ20లు మ్యాచ్‌లు ఆడాడు.

Updated : 20 Feb 2024 5:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top