Home > క్రీడలు > ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్గా విశాఖ ఎందుకు?

ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్గా విశాఖ ఎందుకు?

ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్గా విశాఖ ఎందుకు?
X

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లే తలపడనున్నాయి. మార్చి 23న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. కాగా ఎన్నికల నేపథ్యంలో 21 మ్యాచులకే నిర్వాహకులు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మ్యాచులు మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు జరగనున్నాయి. ఎన్నికల తేదీలు ఖరారయ్యాక ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ రానుంది. తొలి 21 మ్యాచులకు చెన్నై, ముంబై, మొహాలీ, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, లక్నో, విశాఖపట్నం వేదికలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచులు మాత్రం ఢిల్లీ హోం గ్రౌండ్ లో కాకుండా.. విశాఖ వేదికగా జరగనున్నాయి. దీనికి కారణమేంటి? అనేది తెలియక ఫ్యాన్స్ గందరగోళానికి గురవుతున్నారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో మార్చి 5 నుంచి 17వ తేదీ వరకు ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) జరగనుంది. డబ్ల్యూపీఎల్ లో భాగంగా.. తొలి అంచె మ్యాచులు ఫిబ్రవరి 23 మార్చి 4 దాకా బెంగళూరులో జరిగితే ఆ తర్వాత టోర్నీ మొత్తం ఢిల్లీకి షిఫ్ట్ అవుతుంది. ఈ మ్యాచులతో పాటు ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచులు అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరగనున్నాయి.

ఈ కారణంగా ఐపీఎల్ మ్యాచుల నిర్వహణ వీలు కాదని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐకి తెలిపింది. దీంతో మ్యాచులను వైజాగ్ కు మార్చారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ షెడ్యూల్‌..

మార్చి 23న పంజాబ్‌తో.. మొహాలీలో

మార్చి 28న రాజస్తాన్‌తో.. జైపూర్‌లో

మార్చి 31న చెన్నైతో.. వైజాగ్‌లో

ఏప్రిల్‌ 03న కోల్‌కతాతో.. వైజాగ్‌లో

ఏప్రిల్‌ 07న ముంబైతో.. ముంబైలో





Updated : 22 Feb 2024 4:38 PM GMT
Tags:    
Next Story
Share it
Top