Home > క్రీడలు > ICC Worldcup 2023: ఖాళీ కుర్చీలు.. ఓపెనింగ్‌ సెర్మనీ లేదు.. ఊహించని విధంగా వరల్డ్కప్ ప్రారంభం

ICC Worldcup 2023: ఖాళీ కుర్చీలు.. ఓపెనింగ్‌ సెర్మనీ లేదు.. ఊహించని విధంగా వరల్డ్కప్ ప్రారంభం

ICC Worldcup 2023: ఖాళీ కుర్చీలు.. ఓపెనింగ్‌ సెర్మనీ లేదు.. ఊహించని విధంగా వరల్డ్కప్ ప్రారంభం
X

వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీ అంటే.. ఓరేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆట పాటలు, సెలబ్రిటీల డ్యాన్స్ లు, లైటింగ్స్, ఆకాశాన్ని తాకేలా బాణసంచాలు, స్టేడియం మొత్తం నిండిపోయిన అభిమానులు, వాళ్ల సెలబ్రేషన్స్.. ఇలా సంబరాలు అంబరాన్ని అంటేలా ఉంటాయి. ఇక అలాంటిది వరల్డ్ కప్ భారత్ లో జరిగితే.. ఓపెనింగ్ మ్యాచ్ ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియంలో నిర్వహిస్తే.. ఆ సంబరాలు ఎలా ఉంటాయి. కానీ అవేవీ లేవు. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ తూతూ మంత్రంగా ప్రారంభం అయింది. భారీ తారాగణంతో ఓపెనింగ్ సెర్మనీ ఉంటుంది అనుకున్న అభిమానులకు నిరాశ మిగిలింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మెగా టోర్నీ మామూలు మ్యాచుల్లా మొదలయింది. ఆరంభ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని ఊహించారు.





అయితే అది కూడా జరగలేదు. మ్యాచ్ మొదలై 2 గంటలవుతున్నా... స్టేడియం మొత్తం ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. అసలు ఇది వరల్డ్ కప్ టోర్నీనేనా.. మ్యాచ్ జరుగుతున్నది భారత్ లోనేనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ కప్ గ్లోబల్ అంబాసిడర్ హోదాలో సచిన టెండూల్కర్ టోర్నీని అధికారికంగా ప్రారంభించాడనే మాట తప్ప.. మిగతాదంతా నామ మాత్రంగా జరిగింది. దీంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డ్ అయిన బీసీసీఐ.. ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించలేనంత దుస్తితిలో ఉందా అని విమర్శిస్తున్నారు. అయితే అక్టోబర్ 14న జరిగే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లో ఈ ఓపెనింగ్ సెర్మనీ ఉంటుందని కొందరు అంటున్నమాట. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.







Updated : 5 Oct 2023 11:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top