Home > టెక్నాలజీ > చంద్రయాన్-3 ద్వారా ఇస్రోకు రూ. 363 కోట్లు ఆదా

చంద్రయాన్-3 ద్వారా ఇస్రోకు రూ. 363 కోట్లు ఆదా

చంద్రయాన్-3 ద్వారా ఇస్రోకు రూ. 363 కోట్లు ఆదా
X

భూమికి 3.84 లక్షల కి.మీల దూరంలో ఉన్న చంద్ర మండలాన్ని చేరుకొనేందుకు ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌.... చంద్రయాన్‌-3ను శుక్రవారం (జులై 14) ప్రయోగించింది ఇస్రో. నెల్లూరులోని శ్రీహరి కోట స్పేస్ స్టేషన్ నుంచి ప్రయోగించే రాకెట్ లక్ష్యం.. చంద్రున్ని లోతుగా పరిశీలించడమే. చంద్రుని వెనకవైపున్న దక్షిణ భాగ రహస్యాల్ని వెలికి తీయడమే. ఈ భాగంలో సూర్యుడు పడడు. దాంతో ఎప్పుడూ చీకటిగా ఉంటుంది. ఈ ప్రయోగం వల్ల భవిష్యత్తులో అక్కడ నివాసం ఉండొచ్చో లేదో తెలుసుకోవచ్చు. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. అమెరికా, చైనాలను సాధ్యం కాని విషయాన్ని భారత్ చేసినట్లు అవుతుంది. అయితే, చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా ఇస్రో రూ.363 కోట్లు ఆదా చేసిందని అంటున్నారు.

2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రయోగంలో ఉపయోగించిన ఆర్బిటర్.. అప్పటి నుంచి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. దాంతో చంద్రయాన్-3లో కొత్త ఆర్బిటర్ ను పంపలేదు. దీనివల్ల ఇస్రోకు రూ.363 కోట్లు ఆదా అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రయాన్-3 తయారీకి రూ.375 కోట్లు, ఉపగ్రహానికి రూ.240 కోట్లు ఖర్చు అయ్యాయి. 2019లో పంపిన ఆర్బిటర్ బరువు 2,379 కేజీలు. అది ఇప్పటికీ చంద్రుని చుట్టూ తిరుగుతూ.. ఉపరితలాన్ని స్కాన్ చేస్తోంది. ల్యాండర్ తో కమ్యూనికేషన్ కావడానికి కూడా ఆర్బిటర్ అవసరం అవుతుంది.

Updated : 15 July 2023 9:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top