Home > టెక్నాలజీ > Hero Karizma XMR: ఆ ఐకానిక్ బైక్ మళ్లీ వచ్చింది.. ధర ఎంతంటే..?

Hero Karizma XMR: ఆ ఐకానిక్ బైక్ మళ్లీ వచ్చింది.. ధర ఎంతంటే..?

Hero Karizma XMR: ఆ ఐకానిక్ బైక్ మళ్లీ వచ్చింది.. ధర ఎంతంటే..?
X

అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసి.. యూత్ అట్రాక్ట్ చేసిన కరిజ్మా బైక్ మార్కెట్ లోకి మళ్లీ వచ్చింది. 2003లో హీరో కంపెనీ తొలుత కరిజ్మ బైక్ ను లాంచ్ చేసి.. కొన్ని మోడల్స్ ను లాంచ్ చేసింది. తర్వాత కొంతకాలం షట్ డౌన్ అయిన ఈ మోడల్.. తిరిగి మళ్లీ లాంచ్ చేశారు. కరిజ్మా 210 ఎక్స్ఎంఆర్ పేరుతో ఈసారి హైఎండ్ మోడల్ తీసుకొచ్చారు. మంగళవారం (ఆగస్ట్ 29) నిర్వహించిన ఈవెంట్ లో హీరో కరిజ్మా 210 ఎక్స్ఎంఆర్ ను లాంచ్ చేశారు. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ను నియమించింది. ఆయనే దీన్ని లాంచ్ చేశాడు. గతంలో కూడా కరిజ్మాకు హృతిక్ రోషనే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.





ఈ బైక్ 210 సీసీ లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ తో వస్తుంది. సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇందులో టాప్ స్పీడ్ గరిష్ఠంగా 143 కిలోమీటర్లు. డ్యూయల్ టోన్ కలర్ థీమ్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, డిజిటల్ ఇన్సుట్రుమెంట్ క్లస్టర్ లాంటి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇది బ్లూటూత్ కనెక్టవిటీతో వస్తుంది. దీని ధరను రూ.1.82 లక్షలుగా కంపెనీ నిర్ణయించగా.. లాంచింగ్ ఆఫర్ గా రూ.10వేల డిస్కౌంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ బైక్ బుక్కింగ్స్ ఓపెన్ అయ్యాయి.










Updated : 29 Aug 2023 12:14 PM GMT
Tags:    
Next Story
Share it
Top