Home > టెక్నాలజీ > హ్యూందాయ్ నుంచి మరో SUV.. స్టన్నింగ్ ఫీచర్స్తో యూత్ను టార్గెట్ చేస్తూ..

హ్యూందాయ్ నుంచి మరో SUV.. స్టన్నింగ్ ఫీచర్స్తో యూత్ను టార్గెట్ చేస్తూ..

హ్యూందాయ్ నుంచి మరో SUV.. స్టన్నింగ్ ఫీచర్స్తో యూత్ను టార్గెట్ చేస్తూ..
X

సౌత్ కొరియా కంపెనీ హ్యూందాయ్ ఇండియన్ మార్కెట్ లో మరో ఎస్ యూవీని తీసుకొచ్చింది. అదిరే ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తో పాటు.. మిడ్ రేంజ్ ప్రైజ్ దీని ప్రత్యేకత. దీని స్నన్నింగ్ లుక్స్.. టాటా పంచ్, సిట్రోయెన్ సీ3లకు పోటీనిస్తుందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మార్కెట్ లో హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. కేవంలం రూ.11,000తో టోకెన్ అమౌంట్ కట్టి కార్ ను బుక్ చేసుకోవచ్చు.





ఇందులో 391 లీటర్ల బూట్ స్పేస్, 185 మీ.మీ గ్రౌండ్ క్లియరెన్స్, డ్యూయల్ కెమెరా డ్యాష్ క్యామ్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ లతో పాటు ఆరు ఎయిర్ బ్యాగులు ఇందో లో స్పెషల్. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 37 లీటర్లు, 8 ఇంచ్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో వస్తుంది. అంతేకాకుండా ఇందులోని ఎలక్ట్రిక్ సన్ రూఫ్.. వాయిస్ అసిస్టెంట్ తో పనిచేస్తుంది. ఆల్​ న్యూ రేంజర్​ ఖాకి, కాస్మిక్​ బ్లూ షేడ్స్​తో పాటు వైట్​ విత్​ బ్లాక్​ రూఫ్​, స్టేరీ నైట్​, ఫైరీ రెడ్​, అట్లాస్​ వైట్​, టైటాన్​ గ్రే, కాస్మిక్​ బ్లూ విత్​ బ్లాక్​ రూఫ్​ కలర్స్​ లో అందుబాలోకి రానుంది. దీని ధర రూ. 6లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుంది.












Updated : 11 July 2023 3:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top