Home > టెక్నాలజీ > ముకేష్ అంబానీ నయా ప్లాన్..కొత్తగా ఎయిర్​ఫైబర్​ లాంఛ్​..

ముకేష్ అంబానీ నయా ప్లాన్..కొత్తగా ఎయిర్​ఫైబర్​ లాంఛ్​..

ముకేష్ అంబానీ నయా ప్లాన్..కొత్తగా ఎయిర్​ఫైబర్​ లాంఛ్​..
X

జియో సంస్థ వినాయక చవితికి తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సరికొత్తగా ఫైబర్ కేబుల్ అవసరం లేకుండా జియో ఎయిర్ ఫైబర్‌ను లాంచ్ చేయబోతోంది. రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తాజాగా ఈ విషయాన్నివెల్లడించారు. సెప్టెంబర్ 19న ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాట్లు ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ ఆన్యువల్ మీటింగ్‎లో ఆయన మాట్లాడుతూ సంస్థ గత పదేళ్లలో 150 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‎మెంట్స్ చేసినట్లు చెప్పారు. వినాయక చవితి పండుగ రోజు జియో ఎయిర్​ఫైబర్​ లాంఛింగ్ జరుగనుంది.

దేశవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా ఉన్న గృహాలకు 5జీ ఇంటర్నెట్ సేవలను అందించడమే టార్గెట్ గా జియో ఎయిర్​ఫైబర్​ను ప్రవేశపెడుతున్నట్లు ముకేశ్ అంబానీ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇండియన్​ మార్కెట్​లో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా 5జీ సెగ్మెంట్​ను, జియో ఎయిర్​ఫైబర్​ ద్వారా సొంతం చేసుకోవాలని రిలయన్స్ ప్లాన్ వేసింది.





ఎయిర్ ఫైబర్ స్పెషాలిటీ ఇదే ? :

ఫైబర్​ లాంటి వేగంతో ఇంటర్నెట్ సేవలును అందిస్తుంది జియో ఎయిర్ ఫైబర్. అయితే ఇది పూర్తిగా వైర్​ లెస్​ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇదే దీని స్పెషాలిటీ . ఎలాంటి వైర్​లు లేకుండానే స్పీడ్‎గా ఇంటర్నెట్​ సేవలు అందిస్తుంది. కస్టమర్లు జస్ట్ ప్లగ్​ ఇన్​ చేసి, స్విచ్ ఆన్​ చేస్తే చాలు..వారి ఇంట్లోనే పర్సనల్ వై-ఫై హాట్​స్పాట్​ క్రియేట్ అయిపోతుంది. ఇంట్లోనే కాదు ఆఫీస్‎లోనూ జియో ఎయిర్​ఫైబర్‎ను ఎంతో ఈజీగా ఉపయోగించుకోవచ్చు. 1 Gbps స్పీడ్‎తో ఎలాంటి ఆటంకం లేకుండా హై-స్పీడ్​ ఇంటర్నెట్‎ను కస్టమర్లకు అందిస్తుంది. దీనితో ఏకకాలంలో స్మార్ట్​ఫోన్స్​, కంప్యూటర్స్​, ల్యాప్​టాప్స్​, ట్యాబ్లెట్స్​, స్మార్ట్​టీవీ, వంటి అన్ని డివైజ్‎ల‎కు కనెక్ట్​ చేసుకోవచ్చు. ఎన్ని డివైజ్‏లకు ఒకేసారి వై-ఫై కనెక్ట్ చేసినా ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం ఎక్కడా తగ్గదు. అదే దీని మరో స్పెషాలిటీ.




Updated : 28 Aug 2023 1:48 PM GMT
Tags:    
Next Story
Share it
Top