Home > తెలంగాణ > రాష్ట్రంలో భారీగా తహసీల్దార్ల బదిలీ

రాష్ట్రంలో భారీగా తహసీల్దార్ల బదిలీ

రాష్ట్రంలో భారీగా తహసీల్దార్ల బదిలీ
X

రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో తహసీల్దార్లను బదిలీ చేసింది. రెండు మల్టీ జోన్ల పరిధిలో 417 మందిని ట్రాన్స్ ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు బదిలీలు చేస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. మల్టీ జోన్ - 2 పరిధిలోని వారిని బదిలీ చేశారు.

ప్రధానంగా నల్లగొండ జిల్లా వారిని యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లా నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్​ జిల్లా వారిని రంగారెడ్డికి, సూర్యాపేట జిల్లా నుంచి జనగామ, మేడ్చల్ జిల్లా వారిని జనగామ, రంగారెడ్డికి, వనపర్తి జిల్లా నుంచి నాగర్ కర్నూలుకు, వికారాబాద్ జిల్లా నుంచి నాగర్ కర్నూలుకు, మహబూబ్​నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి, గద్వాలకు, సంగారెడ్డి జిల్లా నుంచి మహబూబ్ నగర్, వికారాబాద్‌కు బదిలీ చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తహసీల్దార్లు ఎవరూ సొంత జిల్లాల్లో బాధ్యతలను నిర్వర్తించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.



Updated : 1 Aug 2023 3:13 PM GMT
Tags:    
Next Story
Share it
Top